భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్… వరివైపే రైతు మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో గత ఏడాదిలాగే ఈసారి కూడా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. రైతులు యథావిధిగా వరిని సాగుచేస్తున్నారు. దీంతో మరోసారి తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి పంటల విషయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుటారని భావించినప్పటికీ.. వరినే సాగుచేయడంతో ఈసారి గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పటికే వానాకాలం వరి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను సైతం వ్యవసాయ శాఖ ప్రకటించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు రైతులు. అయితే ప్రతి ఏడాది వరి సాగు గణనీయంగా పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దానిలో భాగంగా గత సంవత్సరం జనవరి మొదటివారంలో 11 వేల 532 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగగా.. ఈసారి అది 11, 240 మెగావాట్లకు చేరింది.
Read Also: మంత్రి హరీష్ రావుని కలిసిన బాలకృష్ణ
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
తెలంగాణ రాష్ట్రంలో గత యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా.. ఈసారి కూడా అంతే దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనలేమని స్పష్టం చేయడంతో.. రైతులు మొదట్లో కొంత గందరగోళనికి గురయ్యారు. ఆ తరువాత డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవాలని సర్కారు సూచించింది. ఇటు ప్రభుత్వం వరి కాకుండా ఇతర పంటలను వేయడం వల్ల వరి సాగు కంటే తక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుందని అధికారులు భావించారు. కానీ సర్కార్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. ప్రత్యామ్నాయ పంటల వైపు కనీస ఆలోచన చేయలేదు రైతులు. ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!