భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్… వరివైపే రైతు మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో గత ఏడాదిలాగే ఈసారి కూడా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. రైతులు యథావిధిగా వరిని సాగుచేస్తున్నారు. దీంతో మరోసారి తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి పంటల విషయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుటారని భావించినప్పటికీ.. వరినే సాగుచేయడంతో ఈసారి గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పటికే వానాకాలం వరి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను సైతం వ్యవసాయ శాఖ ప్రకటించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు రైతులు. అయితే ప్రతి ఏడాది వరి సాగు గణనీయంగా పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దానిలో భాగంగా గత సంవత్సరం జనవరి మొదటివారంలో 11 వేల 532 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగగా.. ఈసారి అది 11, 240 మెగావాట్లకు చేరింది.
Read Also: మంత్రి హరీష్ రావుని కలిసిన బాలకృష్ణ
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
తెలంగాణ రాష్ట్రంలో గత యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా.. ఈసారి కూడా అంతే దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనలేమని స్పష్టం చేయడంతో.. రైతులు మొదట్లో కొంత గందరగోళనికి గురయ్యారు. ఆ తరువాత డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవాలని సర్కారు సూచించింది. ఇటు ప్రభుత్వం వరి కాకుండా ఇతర పంటలను వేయడం వల్ల వరి సాగు కంటే తక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుందని అధికారులు భావించారు. కానీ సర్కార్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. ప్రత్యామ్నాయ పంటల వైపు కనీస ఆలోచన చేయలేదు రైతులు. ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!