భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్… వరివైపే రైతు మొగ్గు
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో గత ఏడాదిలాగే ఈసారి కూడా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. రైతులు యథావిధిగా వరిని సాగుచేస్తున్నారు. దీంతో మరోసారి తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి పంటల విషయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుటారని భావించినప్పటికీ.. వరినే సాగుచేయడంతో ఈసారి గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పటికే వానాకాలం వరి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను సైతం వ్యవసాయ శాఖ ప్రకటించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు రైతులు. అయితే ప్రతి ఏడాది వరి సాగు గణనీయంగా పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దానిలో భాగంగా గత సంవత్సరం జనవరి మొదటివారంలో 11 వేల 532 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగగా.. ఈసారి అది 11, 240 మెగావాట్లకు చేరింది.
Read Also: మంత్రి హరీష్ రావుని కలిసిన బాలకృష్ణ
Also Read
తెలంగాణ రాష్ట్రంలో గత యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా.. ఈసారి కూడా అంతే దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనలేమని స్పష్టం చేయడంతో.. రైతులు మొదట్లో కొంత గందరగోళనికి గురయ్యారు. ఆ తరువాత డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవాలని సర్కారు సూచించింది. ఇటు ప్రభుత్వం వరి కాకుండా ఇతర పంటలను వేయడం వల్ల వరి సాగు కంటే తక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుందని అధికారులు భావించారు. కానీ సర్కార్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. ప్రత్యామ్నాయ పంటల వైపు కనీస ఆలోచన చేయలేదు రైతులు. ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
తాజావార్తలు
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!