BJP Floor Leader: లాస్ట్ ‘ఆర్’ కే ఆ ఛాన్స్..! ఫ్లోర్ లీడర్ రేసులో ఈటల..!
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మూడు.. ఆ పార్టీ శ్రేణులు వారిని ఆర్ఆర్ఆర్గా పిల్చుకుంటున్నారు… రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.. అయితే, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి రఘునందన్రావు, హుజురాబాద్ బైపోల్లో నెగ్గి ఈటల రాజేందర్ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, అప్పడికే పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ మొన్నటి వరకు శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా కొనసాగుతూ వచ్చారు. కానీ, ఓ వివాదాస్పద వీడియోను ఆయను జైలులోకి నెట్టింది.. పీడీ యాక్ట్ నమోదు చేసి.. అరెస్ట్ చేశారు పోలీసులు.. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో ఉన్నారు.. అంతేకాదు.. పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరించారంటూ.. రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అయితే, ఇప్పుడు రెండో ఆర్ (రఘునందన్రావు) కాకుండా.. మూడో ఆర్ (ఈటల రాజేందర్)ను ఫ్లోర్ లీడర్గా చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: CPI Narayana: సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటున్నారు.. తెలంగాణ గవర్నర్ను వెంటనే రీకాల్ చేయాలి..!
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్.. మహమ్మద్ ప్రవక్తపై ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలపై పార్టీ సస్పెండ్ చేయడం.. జైలులో ఉన్నందున, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను పార్టీ ఫ్లోర్ లీడర్గా బీజేపీ నియమించే అవకాశం ఉంది.. అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఈటల రాజేందర్.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేసిన ఈటల వైపే.. పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే ఈటల రాజేందర్.. జాయినింగ్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు.. రాజా సింగ్ పోస్ట్ భర్తీపై చర్చ ప్రారంభమైనందున రాజేందరే ఫ్లోర్ లీడర్గా వ్యవహరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బీజేపీలో మాత్రం దుబ్బాక ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావు.. ఈటల కంటే సీనియర్గా ఉన్నారు.. కానీ, బీజేపీ అధిష్టానం మాత్రం ఈటల వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!