Duddilla Sridhar Babu: పిల్లలకు భవిష్యత్ ఉండొద్దా..?
- హిల్ట్ పాలసీ అంటే భూ మార్పు కాదు.. పిల్లల ఆరోగ్యానికి భరోసా
- నగరం నడిబొడ్డున పరిశ్రమలు - పెరుగుతున్న ప్రమాదాలు
- బంగారు ఆస్తులు కాదు.. స్వచ్ఛమైన గాలే అసలైన వారసత్వం
- భవిష్యత్ తరాల కోసం తెలంగాణ తీసుకున్న చారిత్రక నిర్ణయం : మంత్రి శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారరు. మనం ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్లో ఉన్నామని, అంతరిక్షంలో ఇళ్లు కట్టుకోబోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ, ఈ భూమిపై పుట్టిన జీవికి స్వచ్ఛమైన గాలి, నీరు అందించలేని అసమర్థ నాగరికతలో ఉన్నామనేది చేదు నిజం. అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపి, రాబోయే తరాలకు ఒక ‘క్లీన్ ఎన్విరాన్ మెంట్’ను అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘హిల్ట్’ (HILT) పాలసీకి శ్రీకారం చుట్టిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
చాలా మంది హిల్ట్ పాలసీని కేవలం పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా మార్చే ఒక సాదాసీదా ‘ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్’ ప్రక్రియగా చూస్తున్నారు. కానీ ఇది కేవలం రెవెన్యూ రికార్డుల్లో మార్పు కాదు. “పరిశ్రమలను ఓఆర్ఆర్ (ORR) అవతలికి తరలించి, మన పిల్లలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు విషరహితమైన నీటిని అందించాలన్నదే మా సంకల్పం. ఇది రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం వేస్తున్న ఆరోగ్యకరమైన పునాది” అని మంత్రి వివరించారు.
Also Read
1970వ దశకంలో IDPL రాకతో హైదరాబాద్ పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది. అప్పట్లో బాలానగర్, సనత్ నగర్, ఉప్పల్, జీడిమెట్ల వంటి ప్రాంతాలు నగరం వెలుపల ఉండేవి. కానీ నేడు..ఈ ప్రాంతాలు నగరం నడిబొడ్డున (Central Business Districts) చేరాయి. ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్లు వెలిశాయి. పరిశ్రమల చిమ్నీల నుండి వచ్చే విషపూరిత పొగ నేరుగా బెడ్రూమ్ల్లోకి ప్రవేశిస్తోంది. నివాస గృహాలకు, పరిశ్రమలకు మధ్య ఉండాల్సిన ‘బఫర్ జోన్’ మాయమైపోయింది.
మనం మన పిల్లల కోసం కోట్ల ఆస్తులు కూడబెట్టవచ్చు కానీ, వారు పీల్చే గాలి, తాగే నీరు విషతుల్యం అయితే ఆ ఆస్తుల వల్ల ఉపయోగం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఇది “బిడ్డలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగమన్నట్టు” ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ఒక్కసారి నాశనమైతే తిరిగి రాదని, మనం ఈ భూమికి యజమానులం కాదని, కేవలం ధర్మకర్తలం (Trustees) మాత్రమేనని గుర్తుచేశారు.
చరిత్రలో గొప్ప మార్పులన్నీ ఒకే అడుగుతో మొదలవుతాయని, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి ఆ మొదటి అడుగు తెలంగాణ నుండే ఎందుకు పడకూడదని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. రాజకీయ విమర్శలు పట్టించుకోకుండా, నేల మనుగడ కోసం, పిల్లల ప్రాణాలను కాపాడటం కోసం ఈ చారిత్రక బాధ్యతను ప్రభుత్వం భుజానెత్తుకుందని ఆయన స్పష్టం చేశారు.
పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించడం ద్వారా హైదరాబాద్ను కేవలం కాంక్రీట్ వనంగా కాకుండా, ఒక నివాసయోగ్యమైన మహా నగరంగా మార్చడమే ‘హిల్ట్’ పాలసీ అంతిమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!