Dr K Laxman: చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది అని డా.లక్ష్మణ్ అన్నారు. సుందరయ్య పార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ధన్యవాదాలు మోడీ పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట Dr లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి లు కలిసి మోడీ కటౌట్ కి నిలువెత్తు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 18 వర్గాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దీర్ఘాయుష్షు కోసం నిర్వహించిన విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొన్నారు. అత్యంత వెనకబడ్డ సంప్రదాయ, హస్త కళాకారులు ప్రధాని విశ్వకర్మ వికాస్ యోజన రేపు మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని అన్నారు. చిన్న కులాల, వృత్తులు వారి కోసం శిక్షణ, పనిముట్లు, లోన్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం పెట్టిన ఘనత మోడీది అన్నారు. 18 రకాల వృత్తులు మీద ఆధారపడిన వారికి ఉపయోగ పడే సంక్షేమ కార్యక్రమం ఇది తెలిపారు. చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది అన్నారు. దేశ వ్యాప్తంగా రేపు 70 మంది కేంద్ర మంత్రులు వివిధ స్థలాల్లో పాల్గొంటారని వెల్లడించారు. 750 జిల్లా కేంద్రాల్లో రేపు OBC మోర్చా తరపున ధన్యవాదాలు, మోడీ కార్యక్రమం పేరుతో బైక్ ర్యాలీ, పాలాభిషేకం కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
రేపు తెలంగాణ విమోచనం కాబట్టి తెలంగాణలో బీజేపీ కార్యాలయంలో మోడీ దీర్ఘాయుష్షు కోసం విశ్వకర్మ యజ్ఞం చేసామని, అన్నీ అసెంబ్లీ కేంద్రాల్లో ర్యాలీలు చేశామని వెల్లడించారు. రేపు అన్ని జిల్లాల్లో obc, బీజేపీ తరపున ప్రత్యక్ష కార్యక్రమాలు ఏర్పాటు జరిగిందన్నారు. దేశంలో 30 లక్షల కుటుంబాలకు, తెలంగాణ, ఆంధ్రా లో నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఉపయోగ పడుతుందని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే కానీ ఇది ప్రజలకోసం చేసి పని అన్నారు. బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే పెంచాల్సింది పోయి.. 22 శాతం తగ్గించి బీసీ లను మోసం చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో కొత్త డ్రామా కేసీఆర్ మొదలు పెట్టిండని అన్నారు. కవితమ్మ మీ పార్టీ లో మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ ల స్థానం ఏంటిది? అని ప్రశ్నించారు. కేంద్రంలో 11 మంది మహిళా మంత్రులు, 8 మంది మహిళా గవర్నర్లు ఉన్నారని అన్నారు. ఈ తీర్మానాలను నమ్మి మోసపోయే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. ఎంబీసీ అన్నావ్ ఏమయ్యింది? 119 లో ఎన్ని బీసీ లకు, ఎన్ని మహిళలకు ఇచ్చావ్ కేసీఆర్ అది చెప్పు? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
IAS officer: మహిళా IAS అధికారికి వేధింపులు.. స్వీట్ బాక్స్తో డెరెక్టుగా ఇంటికి వెళ్లిన వ్యక్తి
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!