Dr K Laxman: చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది అని డా.లక్ష్మణ్ అన్నారు. సుందరయ్య పార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ధన్యవాదాలు మోడీ పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట Dr లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి లు కలిసి మోడీ కటౌట్ కి నిలువెత్తు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 18 వర్గాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దీర్ఘాయుష్షు కోసం నిర్వహించిన విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొన్నారు. అత్యంత వెనకబడ్డ సంప్రదాయ, హస్త కళాకారులు ప్రధాని విశ్వకర్మ వికాస్ యోజన రేపు మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని అన్నారు. చిన్న కులాల, వృత్తులు వారి కోసం శిక్షణ, పనిముట్లు, లోన్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం పెట్టిన ఘనత మోడీది అన్నారు. 18 రకాల వృత్తులు మీద ఆధారపడిన వారికి ఉపయోగ పడే సంక్షేమ కార్యక్రమం ఇది తెలిపారు. చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది అన్నారు. దేశ వ్యాప్తంగా రేపు 70 మంది కేంద్ర మంత్రులు వివిధ స్థలాల్లో పాల్గొంటారని వెల్లడించారు. 750 జిల్లా కేంద్రాల్లో రేపు OBC మోర్చా తరపున ధన్యవాదాలు, మోడీ కార్యక్రమం పేరుతో బైక్ ర్యాలీ, పాలాభిషేకం కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
రేపు తెలంగాణ విమోచనం కాబట్టి తెలంగాణలో బీజేపీ కార్యాలయంలో మోడీ దీర్ఘాయుష్షు కోసం విశ్వకర్మ యజ్ఞం చేసామని, అన్నీ అసెంబ్లీ కేంద్రాల్లో ర్యాలీలు చేశామని వెల్లడించారు. రేపు అన్ని జిల్లాల్లో obc, బీజేపీ తరపున ప్రత్యక్ష కార్యక్రమాలు ఏర్పాటు జరిగిందన్నారు. దేశంలో 30 లక్షల కుటుంబాలకు, తెలంగాణ, ఆంధ్రా లో నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఉపయోగ పడుతుందని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే కానీ ఇది ప్రజలకోసం చేసి పని అన్నారు. బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే పెంచాల్సింది పోయి.. 22 శాతం తగ్గించి బీసీ లను మోసం చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో కొత్త డ్రామా కేసీఆర్ మొదలు పెట్టిండని అన్నారు. కవితమ్మ మీ పార్టీ లో మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ ల స్థానం ఏంటిది? అని ప్రశ్నించారు. కేంద్రంలో 11 మంది మహిళా మంత్రులు, 8 మంది మహిళా గవర్నర్లు ఉన్నారని అన్నారు. ఈ తీర్మానాలను నమ్మి మోసపోయే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. ఎంబీసీ అన్నావ్ ఏమయ్యింది? 119 లో ఎన్ని బీసీ లకు, ఎన్ని మహిళలకు ఇచ్చావ్ కేసీఆర్ అది చెప్పు? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
IAS officer: మహిళా IAS అధికారికి వేధింపులు.. స్వీట్ బాక్స్తో డెరెక్టుగా ఇంటికి వెళ్లిన వ్యక్తి
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!