Flexes War: తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీల రాజకీయం.. కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flexes War: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎన్నికల యుద్ధం నడుస్తోంది. ఇవాళ హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. అలాగే రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు హాజరవుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఆరు హామీల పేరుతో ఎన్నికల హామీలను కూడా ప్రకటిస్తామన్నారు. మరోవైపు సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రేపు పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ సందర్భంగా నగరంలో కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నిస్తూ ప్రత్యర్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ప్రశ్నిస్తూ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై ఫ్లెక్సీలు పెట్టారు. 100 మంది వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతున్నారు. వారిని ఆహ్వానిస్తూ బ్యానర్లు కనిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాదు.
Read also: CWC meeting: హైదరాబాద్లో కాంగ్రెస్ మీటింగ్.. 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రధాన ఎజెండా..
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారు చేసిన మోసాల వివరాలతో పోస్టర్లు అంటించారు. హోర్డింగ్లలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫోటోలు, వారి కుంభకోణాల వివరాలను అందులో ఉంచారు. బివేర్ ఆఫ్ స్కామర్స్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో 2 వేల 16 రూపాయల వృద్ధాప్య పింఛను ఇస్తుంటే… కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇస్తున్న పింఛన్ ఎంత? అని ప్రశ్న అడిగాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని రాహుల్, సోనియా గాంధీ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో వరంగల్ నుంచి ఐటీ మంత్రిగా ఉండి కూడా వరంగల్ కు ఒక్క ఐటీ కంపెనీని ఎందుకు తీసుకురాలేదు? 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదు? ఇప్పుడు కూడా ఎస్సీ డిక్లరేషన్ పేరుతో ఇలాగే చేస్తామని నిరసన తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వెలిశాయి. గోవా విమోచన దినోత్సవానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణా సమైక్యతా దినోత్సవానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణకు వచ్చే అమిత్ షా ఏదైనా ప్రకటిస్తారా అని ప్రశ్నించారు.
CWC meeting: హైదరాబాద్లో కాంగ్రెస్ మీటింగ్.. 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రధాన ఎజెండా..
తాజావార్తలు
-
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు లైన్క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం
-
DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!
-
Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
-
Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!