సీఎంగా ఉండే అర్హత కేసీఆర్కు లేదు.. వెంటనే రాజీనామా చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్కు లేదు.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హుజురాబాద్లో దళిత బంధు నిలుపుదలకు కేసీఆరే కారణం అన్నారు.. రెండు నెలలలోపు హుజురాబాద్ లో అందరికి “దళిత బంధు” ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళిత బంధును బీజేపీ ఆపిందని నిందలు వేస్తున్నారని విమర్శించారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి 10 వేల రూపాయలు ఇస్తామన్నారు.. ఇప్పటికి ఇవ్వలేదని ఆరోపించిన ఆమె.. 10 వేల రూపాయలు ఇవ్వొద్దని బండి సంజయ్ ఈసీకి లేఖ రాసినట్లుగా దొంగ లేఖ సృష్టించారని మండిపడ్డారు.
హుజురాబాద్లో రెండు నెలలుగా దళిత బంధు అమలు చేయకుండా ఏం చేశారు.. హుజురాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు డీకే అరుణ.. ఒక నియోజకవర్గంలో ఎన్నికల కోసం తెచ్చిన అబద్దపు హామీ, మోసం తేట తెల్లమైందన్నారు. బీజేపీ “దళిత బంధు” ఆపింది అన్న అసత్య ప్రచారాలు టీఆర్ఎస్ ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. దళితులకు ఆశ పెట్టి మోసం చేయాలనుకున్నారు.. కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలన్నారు. యాదగిరి నరసింహ స్వామి మోసాలు చేయమని చెప్పాడా? అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. “దళిత బంధు” ఆపమని బీజేపీ లేఖ రాస్తే ఆ లేఖను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.. దళితులనే కాదు బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు. ఎన్నికల కోసం పథకాలు కాదు.. రాష్ట్ర సంక్షేమం కోసం పథకాలు ఉండాలని.. వర్షాలు పడి పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు.. పంట నష్ట అంచనా వేయలేదు… “రైతు బంధు”ఇచ్చామని ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ.
Also Read
- Tags
- bjp
- cm kcr
- DK Aruna
- Huzurabad bypoll
- kcr
తాజావార్తలు
-
Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
-
Thailand visa : ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే థాయ్లాండ్లో 5 ఏళ్ళు ఉండొచ్చని తెలుసా ? ఏం చేయాలంటే ?
-
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
-
Thriller Movie : చీకటి పడితే భయంతో తలుపులు మూసేసుకునే గ్రామం… ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
-
Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!