DK Aruna: ప్రీతి కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.. నిజానిజాలు బయటకు రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna Fires On CM KCR Over Preethi Case: సీఎం కేసీఆర్ మెడికో ప్రీతి కేసుని నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.. తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి, ఈ కేసుని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని, అలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ప్రీతి హత్య కేసులో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపేందుకు.. సీఎంగా కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
High Court Stay on Polavaram Canal: పోలవరం కాలువ తవ్వకాలపై హైకోర్టు స్టే
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
కేసీఆర్కు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని డీకే అరుణ ఆరోపణలు చేశారు. మంత్రుల కుటుంబసభ్యులు క్రిమినల్ కేసుల్లో ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం వారిని కాపాడుకుంటూ వెనకేసుకు వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ తీరు వల్లే.. బీఆర్ఎస్ తమకు అండగా ఉంటుందని నేరస్తులు ధీమాగా ఉన్నారని మండిపడ్డారు. తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం దిశా కేసులో ఎన్కౌంటర్ చేయించారన్నారు. కేఎంసీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయలేదంటే.. నేరం నుంచి తప్పించుకోవడం కోసం పకడ్బందీగా ఎలాంటి ప్లాన్ వేశారో అర్థం చేసుకోవాలన్నారు. మొదటి క్యాబినెట్లో మహిళలు లేరని, రెండో క్యాబినెట్పై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని ఇద్దరు మహిళలకు కేసీఆర్ చోటిచ్చారన్నారు.
Kushboo Sundar: నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. అక్కడ తాకుతూ
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు జరుగుతున్నాయని, ఆడపిల్లలను చదువు కోవడం కోసం హాస్టల్స్కు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారని డీకే అరుణ అన్నారు. మరోసారి అధికారంలోకి రావాలని ఆలోచన తప్పితే.. మహిళలపై జరుగుతున్న దారుణాలుపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడా? అని నిలదీశారు. కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడి గురై, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అలాంటి కాలేజీ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు ఈ వ్యవహారంపై ఏనాడైనా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందా? అనే సందేహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?