MLC Kavitha: మహిళలు వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kalvakuntla Kavitha Speech On International Womens Day: మహిళలు ఎప్పుడూ వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలని, దాని కోసం ప్రతి మహిళ ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సమయం పని చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్న ఉద్దేశంతో.. గ్రామాల్లో పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 30 లక్షల కొలువులను కేసీఆర్ సర్కార్ ఇచ్చిందన్నారు.
Satyavathi Rathod: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేస్తోంది
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
తన తల్లి తనను ఆ కాలంలో పట్టుబట్టి మరీ ఇంగ్లీష్ మీడియం చదివించిందని, అందుకు తాను మానుకొండూర్ గడ్డ మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కవిత చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లోని మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో రూ.18 వేల కోట్ల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మహిళలు అందించిందని తెలియజేశారు. పేద కుటుంబాలకు కచ్ఛితంగా ఇల్లు కట్టుకోవడం కోసం రూ.3 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, మాయమాటలు చెప్పడం తప్ప చేతల్లో చేసి చూపించిదేమీ లేదని మండిపడ్డారు. పాలు, పెరుగు మీద కూడా బీజేపీ ప్రభుత్వం పన్ను వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోసి గొంగడి వేసుకొని, ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే రసమయి అని పేర్కొన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా రసమయిని 60 వేల ఓట్ల మెజారిటీతీ మన మహిళలు గెలిపించాలని కోరారు.
Harish Rao: మహిళలకు మరో కానుక.. వడ్డీ లేని రుణం
అంతకుముందు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ను త్వరలో ప్రారంభించనున్నామని కవిత వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలన్న సంకల్పంతో.. సీఎం కేసీఆర్ ఐటీ హబ్లను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్లో ఐటీ హబ్ నిర్మాణానికి కేసీఆర్, కేటీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఐటీ హబ్లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభిస్తుందన్నారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్కు రానున్నాయని, ఇప్పటికే 200 పైచిలుకు సీట్ల ఒప్పందాలు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!