MLC Kavitha: మహిళలు వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kalvakuntla Kavitha Speech On International Womens Day: మహిళలు ఎప్పుడూ వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలని, దాని కోసం ప్రతి మహిళ ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సమయం పని చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్న ఉద్దేశంతో.. గ్రామాల్లో పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 30 లక్షల కొలువులను కేసీఆర్ సర్కార్ ఇచ్చిందన్నారు.
Satyavathi Rathod: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేస్తోంది
Also Read
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
తన తల్లి తనను ఆ కాలంలో పట్టుబట్టి మరీ ఇంగ్లీష్ మీడియం చదివించిందని, అందుకు తాను మానుకొండూర్ గడ్డ మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కవిత చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లోని మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో రూ.18 వేల కోట్ల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మహిళలు అందించిందని తెలియజేశారు. పేద కుటుంబాలకు కచ్ఛితంగా ఇల్లు కట్టుకోవడం కోసం రూ.3 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, మాయమాటలు చెప్పడం తప్ప చేతల్లో చేసి చూపించిదేమీ లేదని మండిపడ్డారు. పాలు, పెరుగు మీద కూడా బీజేపీ ప్రభుత్వం పన్ను వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోసి గొంగడి వేసుకొని, ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే రసమయి అని పేర్కొన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా రసమయిని 60 వేల ఓట్ల మెజారిటీతీ మన మహిళలు గెలిపించాలని కోరారు.
Harish Rao: మహిళలకు మరో కానుక.. వడ్డీ లేని రుణం
అంతకుముందు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ను త్వరలో ప్రారంభించనున్నామని కవిత వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలన్న సంకల్పంతో.. సీఎం కేసీఆర్ ఐటీ హబ్లను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్లో ఐటీ హబ్ నిర్మాణానికి కేసీఆర్, కేటీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఐటీ హబ్లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభిస్తుందన్నారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్కు రానున్నాయని, ఇప్పటికే 200 పైచిలుకు సీట్ల ఒప్పందాలు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!