Dharani Special Drive: సచివాలయంలో ధరణి కమిటి సమావేశం.. అప్లికేషన్లపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharani Special Drive: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ నాలుగులోగా ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. ధరణిలో మొత్తం 119 తప్పులలో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారమైన లక్ష అప్లికేషన్లతో పాటు పెండింగ్ అప్లికేషన్ లపై సమీక్ష చేపట్టనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో ధరణి పోర్టల్, కలెక్టర్ల లాగిన్లో కుప్పలు తెప్పలుగా పెండింగ్లో ఉన్నాయి.
Read also: Medigadda: మేడిగడ్డ పనులు ప్రారంభం.. బ్లాక్-7లో 8 గేట్లను ఎత్తివేసేందుకు చర్యలు
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సూచనల మేరకు ధరణి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించడానికి మరియు ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి సంబంధిత నివేదికలు తయారు చేయబడ్డాయి. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. మార్చి 16న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఉండడంతో ధరణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవడం మానేశారు. ఈ క్రమంలో శనివారం కమిటీ సమావేశం కానుంది. జూన్ 4లోగా ధరణిలో సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కమిటీ.. ఆ తర్వాత ధరణి పోర్టల్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కమిటీకి స్పష్టం చేసింది. తప్పులను సరిదిద్దే పనిలో కమిటీ నిమగ్నమైంది.
TS Eamcet Results: నేడు తెలంగాణ ఎంసెట్ రిజల్ట్.. 11 గంటలకు పలితాలు విడుదల..
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?