Dharani Special Drive: సచివాలయంలో ధరణి కమిటి సమావేశం.. అప్లికేషన్లపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharani Special Drive: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ నాలుగులోగా ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. ధరణిలో మొత్తం 119 తప్పులలో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారమైన లక్ష అప్లికేషన్లతో పాటు పెండింగ్ అప్లికేషన్ లపై సమీక్ష చేపట్టనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో ధరణి పోర్టల్, కలెక్టర్ల లాగిన్లో కుప్పలు తెప్పలుగా పెండింగ్లో ఉన్నాయి.
Read also: Medigadda: మేడిగడ్డ పనులు ప్రారంభం.. బ్లాక్-7లో 8 గేట్లను ఎత్తివేసేందుకు చర్యలు
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సూచనల మేరకు ధరణి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించడానికి మరియు ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి సంబంధిత నివేదికలు తయారు చేయబడ్డాయి. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. మార్చి 16న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఉండడంతో ధరణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవడం మానేశారు. ఈ క్రమంలో శనివారం కమిటీ సమావేశం కానుంది. జూన్ 4లోగా ధరణిలో సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కమిటీ.. ఆ తర్వాత ధరణి పోర్టల్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కమిటీకి స్పష్టం చేసింది. తప్పులను సరిదిద్దే పనిలో కమిటీ నిమగ్నమైంది.
TS Eamcet Results: నేడు తెలంగాణ ఎంసెట్ రిజల్ట్.. 11 గంటలకు పలితాలు విడుదల..
తాజావార్తలు
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
-
Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!