Mahender Reddy: తెలంగాణ ఏర్పడ్డాక శాంతి భద్రతలపై అనుమానాలు ఉన్నా.. అధిగమించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Mahender Reddy Retirement: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు పదవీవిరమణ చేయనున్నారు. శనివారం తెలంగాణ పోలీస్ అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 36 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. అంజనీ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. తనకు సర్వీసులో సహకరించిన హోం గార్డులకు, పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: Hyderabad New Year Traffic Rules: న్యూ ఇయర్ వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు పాటించాల్సిందే
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నాం అని అన్నారు. ఆపదలో ఉన్నవారికికి పోలీసులున్నారనే నమ్మకాన్ని ఇచ్చామని.. పోలీస్ శాఖలో పనిచెస్తున్న వారి జీతభత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్సులు, హోమ్ కార్డులకు 20 వేల జీతాన్ని ఇస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 27 వేల పోలీసులను రిక్రూట్ చేసుకోగా… త్వరలో మరో 17 వేల మంది పోలీస్ శాఖలో చేరనున్నారని వెల్లడించారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసులు పరిష్కరించామని.. రానున్న రోజుల్లో నేరాలు డిజిటల్ రూపంలోకి మారుతాయని.. కాబట్టి పోలీసులంతా టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలని సూచించారు. విజనరీ దృష్టిలో ఉంచుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ మాట్లాడుతూ.. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభద్రతకు తెలంగాణ పెద్ద పీట వేస్తుందని.. దేశ అభివృద్ధికి తెలంగాణ ఇంజన్ లాంటిదని అన్నారు. పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ తీసుకురావడానికి డీజీపీ మహేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పోలీస్ వ్యవస్థ లో డీజీపీ మహేందర్ రెడ్డి తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు అన్ని కొనసాగిస్తా అని తెలిపారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!