Chikoti Casino Case: క్యాసినో కేసులో నేడు ఈడీ ముందుకు దేవేందర్ రెడ్డి, తలసాని పీఏ హరీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chikoti Casino Case: తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈడీ విచారణ రోజుకో మలుపుతో దూకుడు పెంచుతుండటంతో రాజకీయ వేడిని పెంచుతోంది. ఇక.. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో గుబులు మొదలైంది. ఈడీ విచారిస్తున్న సమయంలో బీపీ డౌన్ కావడంతో అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తులో భాగంగా డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, తలసాని పీఏ హరీష్ మరికొందరు వ్యాపారులను సైతం ఈడీ విచారించనుంది. ఇప్పటికే విచారణకు హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. తాజాగా మంత్రి తలసాని సోదరులను విచారించింది ఈడీ.ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హవాలా నగదు చెల్లింపులపై ఈడీ ఆరా తీస్తుంది.
read also: Annatto Seeds : ఈ గింజలు తింటే యవ్వనం మీ సొంతం
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ఇక తాజాగా..ఈడీ ముందు హాజరైన ఎల్.రమణకు అస్వస్థతకు గురయ్యారు. ఈడీ విచారిస్తున్న సమయంలో బీపీ డౌన్ కావడంతో.. ఆయనకు ఆసుపత్రికి తరలించారు. ఎల్.రమణ అనారోగ్యంతో వున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బీపీ డౌన్ కావడంతో కొందికి పడిపోవడంతో స్పందించిన అధికారులు ఆయనతో పాటు ఎల్.రమణ గన్ మెన్ , ఈడీ కి సంబంధించిన ఒక అధికారిని ఆయనతో పాటు ఆసుపత్రికి తరలించారు. ఈడీ విచారణ తరువాత ఆయన బయటకు వచ్చి పూర్తీ వివరాలు వెల్లడిస్తా అంటూ మీడియాకు తెలిపి లోనికి వెళ్లిన ఎల్.రమణ ఇలా అస్వస్థతకు గురికావడంతో సంచళనంగా మారింది.
Fraud: పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండంటూ.. వందల కోట్లకు కుచ్చుటోపీ
క్యాసినోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పంటర్లు రూ.కోట్లలో జూదం ఆడినట్లు ఈడీ అనుమానిస్తోంది. వీరిలో కీలక ప్రజాప్రతినిధులతోపాటు సంపన్న వ్యాపారులున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఆ లావాదేవీల గుట్టుతేల్చే పనిలో భాగంగానే ఈడీ బృందాలు ప్రవీణ్, మాధవరెడ్డిల బ్యాంకు ఖాతాలతోపాటు పంటర్లను తరలించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానాల వ్యవహారం గురించి ఆరా తీశాయి. ఆడంబరమైన జీవితం గడుపుతూ ఆ దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేస్తూ వచ్చిన ప్రవీణ్కు ఇప్పుడా దృశ్యాలే సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. వాటికి ఖర్చు చేసేందుకు వినియోగించిన సొమ్మును ఎలా సంపాదించారని ఈడీ వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
Cold Wave: రగ్గులు కప్పుకున్న నరాలుతెగే చలి.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తాజావార్తలు
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!