Hyderabad Murder: హైదరాబాద్లో మరో హత్య.. కాచిగూడ రైల్వే ఫ్లాట్ ఫామ్ పై మృతదేహం..
- హైదరాబాద్లో సంచలనంగా మారిన మరో హత్య..
- కాచిగూడ రైల్వే ప్లాట్ఫారమ్లో మృతదేహం లభ్యం..
- భయాందోళనకు గురైన స్థానికులు..
- ఇది హత్యకాదు పక్కా మర్డర్ అంటున్న కుటుంబసభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Murder: హైదరాబాద్లో మరో హత్య సంచలనంగా మారింది. కాచిగూడ రైల్వే ప్లాట్ఫారమ్లో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాట్ ఫామ్ పై వున్న సిబ్బంది మృత దేహాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే రైల్వే పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో హుటా హుటిన రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కిజార్ అనే వ్యక్తిగా గుర్తించారు. పాత నగరానికి చెందిన చుమ్మా చౌష్ మనవడుగా తెలిపారు పోలీసులు. కిజార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే కిజార్ కుటుంబం ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపి రైల్వే ట్రాక్ పై పడేసి వెళ్లారని వాపోయారు. కిజార్ తండ్రి సోహెల్ మాట్లాడుతూ.. నా కొడుకు కిజార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని తెలిపాడు. ఇది ఆక్సిడెంట్ కాదని, ఇది పక్కా మర్డర్ అని తెలిపారు. ఉదయం 4.30 గంటలకు కిజార్ లేచి తన తల్లికి ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లాడని తెలిపారు. గంటకే పోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భయాందోళన చెందామని తెలిపారు.
Read also: CM Chandrababu: రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్..!
Also Read
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. నా కొడుకు కిజార్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పడు నేను ఆఫీస్ లో వున్నానని తెలిపాడు. నాకు నా చిన్న కొడుకు కిజార్ గురించి సమాచారం ఇచ్చాడని అన్నారు. స్నేహితులని, బంధువును అడగాలని తెలుపగా.. అడిగినా సరైన సమాధానం లేదని చిన్న కొడుకు తెలిపాడు. కొందరు తెలిసిన వాళ్లు మాకు కాల్ చేసి కాచిగూడ వెళ్లాలని తెలుపడంతో మేమందరం అక్కడకు వెళ్లామని అన్నాడు. నా కొడుకు వస్తాడనే మేము వెతుకుతూనే వున్నామని పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తండ్రి అన్నారు. తన కొడుకు మృతదేహం మహమ్మద్ నగర్ వద్ద మహమ్మదీయ మసీదు వద్ద నా కొడుకును మర్డర్ చేసి వుంటారని నా అనుమానం అన్నారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరిస్తూ కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకును ఎవరో చంపేసి కాచీగూడ రైల్వే ట్రాక్ పై పడేసి వుంటారని తెలిపారు. ఎందుకంటే తన తలపై, మోకాళ్లపై బలమైన గాయాలు ఉన్నాయని అన్నారు. తన తలను కూడా నరికేసి రైల్వే ట్రాక్ పై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తు్న్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులు సరైన విచారణ జరపాలని వేడుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటూ మోకాళ్ల వద్ద బలమైన గాయాలు వున్నాయని, మొఖంపై కంటి మీద కూడ గొడ్డలితో నరికి నట్లు వుందని అనుమానం వ్యక్తం చేశాడు. సరైన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
US- Taiwan: తైవాన్కు అమెరికా నుంచి వెయ్యి సాయుధ డ్రోన్లు.. చైనాకు చెక్ పెట్టేందుకేనా?
తాజావార్తలు
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
-
Yash: రాకింగ్ స్టార్ యష్తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
-
Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!