Dead body in drum: వీడిన డ్రమ్ములో డెడ్ బాడీ మర్డర్ మిస్టరీ.. చంపింది ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead body in drum: హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రమ్ములో మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడు పురాన్ సింగ్గా గుర్తించారు. పురాన్ సింగ్ హత్యకు మాజీ ప్రియురాలి కారణమని పోలీసులు తేల్చారు. నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన డ్రమ్ములో మృతదేహం కేసును పోలీసులు విచారించారు. డ్రమ్ములోని మృతదేహం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురాన్ సింగ్గా పోలీసులు గుర్తించారు.
ఈ ఏడాది మే 22న పురాన్ సింగ్ మిస్సింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో పురాన్ సింగ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గత నెల 25న చెరువులోని డ్రమ్ములో పురాన్ సింగ్ మృతదేహం లభ్యమైంది. పూరన్ సింగ్ హత్యలో జయదేవి అనే మహిళ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయదేవి, పురాన్ సింగ్ గతంలో ప్రేమించుకున్నారు. అయితే జయదేవిని కాదని పురన్ సింగ్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పురాణా సింగ్కి ఇద్దరు పిల్లలు. పురాణా సింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పురాన్ సింగ్ నివాసం ఉంటున్నాడు. పానీ పూరి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
ఈ నెల 22న పూరన్ సింగ్ భార్య మమతాదేవి తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పూరన్ సింగ్ ఆమెకు బదులుగా మరో యువతిని పెళ్లాడడంతో జయదేవికి పురాన్ సింగ్ పై కక్ష్య పెంచుకుంది. దీంతో జయదేవి హైదరాబాద్ చేరుకు రాజస్తాన్ కు చెందిన నజీమ్ అనే వ్యక్తిని ప్రేమలో పడేసింది. పురాన్ సింగ్తో ప్రేమ వ్యవహారం గురించి ప్రియుడు నజీమ్కు చెప్పింది. పూరన్ సింగ్ను చంపేయాలని ప్రియుడు నజీమ్ను కోరింది. దీంతో నజీమ్ తన ప్రియురాలి కోరికను తీర్చడానికి అంగీకరించాడు. నజీమ్ మైనర్ బాలుడి సహాయంతో పురన్ సింగ్ను పిలిపించాడు. పూరన్ సింగ్ను తన స్నేహితుడు సుగుణరామ్, జయదేవి సాయంతో నజీమ్ హత్య చేశాడు. పూరానా సింగ్ మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి చెరువులో పడేశారు. పురన్ సింగ్ను హత్య చేసిన నజీమ్, సూగుణారామ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జయదేవితో పాటు మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడని పోలీసుల తెలిపారు. జయదేవి, మైనర్ బాలుడికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Adah sharma : భారీ హిట్ కొట్టినా ఆ హీరోయిన్ ను పట్టించుకోని దర్శకులు..!!
తాజావార్తలు
-
Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
-
AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
-
Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
-
BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..