Dead body in drum: వీడిన డ్రమ్ములో డెడ్ బాడీ మర్డర్ మిస్టరీ.. చంపింది ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead body in drum: హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రమ్ములో మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడు పురాన్ సింగ్గా గుర్తించారు. పురాన్ సింగ్ హత్యకు మాజీ ప్రియురాలి కారణమని పోలీసులు తేల్చారు. నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన డ్రమ్ములో మృతదేహం కేసును పోలీసులు విచారించారు. డ్రమ్ములోని మృతదేహం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురాన్ సింగ్గా పోలీసులు గుర్తించారు.
ఈ ఏడాది మే 22న పురాన్ సింగ్ మిస్సింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో పురాన్ సింగ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గత నెల 25న చెరువులోని డ్రమ్ములో పురాన్ సింగ్ మృతదేహం లభ్యమైంది. పూరన్ సింగ్ హత్యలో జయదేవి అనే మహిళ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయదేవి, పురాన్ సింగ్ గతంలో ప్రేమించుకున్నారు. అయితే జయదేవిని కాదని పురన్ సింగ్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పురాణా సింగ్కి ఇద్దరు పిల్లలు. పురాణా సింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పురాన్ సింగ్ నివాసం ఉంటున్నాడు. పానీ పూరి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Also Read
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
- Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
- Operation Muskaan : 'ఆపరేషన్ ముస్కాన్' సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
- OTR : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. అసలు కారణం ఇదే
ఈ నెల 22న పూరన్ సింగ్ భార్య మమతాదేవి తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పూరన్ సింగ్ ఆమెకు బదులుగా మరో యువతిని పెళ్లాడడంతో జయదేవికి పురాన్ సింగ్ పై కక్ష్య పెంచుకుంది. దీంతో జయదేవి హైదరాబాద్ చేరుకు రాజస్తాన్ కు చెందిన నజీమ్ అనే వ్యక్తిని ప్రేమలో పడేసింది. పురాన్ సింగ్తో ప్రేమ వ్యవహారం గురించి ప్రియుడు నజీమ్కు చెప్పింది. పూరన్ సింగ్ను చంపేయాలని ప్రియుడు నజీమ్ను కోరింది. దీంతో నజీమ్ తన ప్రియురాలి కోరికను తీర్చడానికి అంగీకరించాడు. నజీమ్ మైనర్ బాలుడి సహాయంతో పురన్ సింగ్ను పిలిపించాడు. పూరన్ సింగ్ను తన స్నేహితుడు సుగుణరామ్, జయదేవి సాయంతో నజీమ్ హత్య చేశాడు. పూరానా సింగ్ మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి చెరువులో పడేశారు. పురన్ సింగ్ను హత్య చేసిన నజీమ్, సూగుణారామ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జయదేవితో పాటు మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడని పోలీసుల తెలిపారు. జయదేవి, మైనర్ బాలుడికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Adah sharma : భారీ హిట్ కొట్టినా ఆ హీరోయిన్ ను పట్టించుకోని దర్శకులు..!!
తాజావార్తలు
-
PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
-
India vs Sri Lanka: గంభీర్కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
-
US Visa Rules 2026: అమెరికా వీసాకు ఇక రూ.17 లక్షల బాండ్.. భారతీయులకు భారీ ఊరట.. పూర్తి వివరాలు ఇవే
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి!
-
Lung Cancer: వంటగదిలో క్యాన్సర్ ముప్పు… మహిళలను నిండా ముంచుతున్న సంప్రదాయవాదులు ఆలోచనలు!
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!