Dasoju Sravan: తెలంగాణలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో యువత ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా వుంటే 80 వేల ఉద్యోగాలే భర్తీచేయడం ఏంటని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి విపక్షాలు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన రీతిలో విమర్శలు చేస్తున్నారు. 2004 – 14 వరకు ఉద్యమం లో యువత పెద్దన్న పాత్ర. 2014 – 22 వరకు ఉద్యోగాల కోసం యువత ఆశగా చూసారు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో నిరుద్యోగులు, యువత వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ తో చెప్పారన్నారు.
ఈరోజు నుండే 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తున్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారన్నారు శ్రవణ్. ఈరోజు వరకు ఒక ఉద్యోగ ప్రకటన లేదు. సీఎస్ ఉద్యోగాల భర్తీ పై సమీక్షలో చెప్పిన మాటలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడమేనన్నారు. కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ,మరికొన్ని బోర్డు ల ద్వారా రీక్యూటిమెంట్ లు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బోర్డుల ద్వారా నియామకాలు అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టడానికి కుట్ర జరుగుతుందన్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
టీఎస్పీఎస్సీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. 300 మంది పనిచేసే చోట కేవలం 80 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే జరపాలి. బోర్డులు అంటేనే అవినీతి. నిరుద్యోగుల వ్యతిరేకత ను తగ్గించుకోవడానికి నియోజకవర్గాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు దాసోజు శ్రవణ్. కోచింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. 40 లక్షల మందికి ప్రభుత్వం నుండి స్టడీ సెంటర్ల ద్వారా కోచింగ్ ఇవ్వకుండా ఎమ్మెల్యేల ద్వారా ఎందుకు ఇప్పిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. నిరుద్యోగ భృతి 3వేలు చెల్లించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రయివేటు సెక్టార్లలో 90 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. బిస్వాల్ కమిటీ లో చెప్పిన లక్షా 91 వేలల్లో మిగిలిన లక్ష ఉద్యోగాలు ఎక్కడ అని ఎమ్మెల్యేలని గల్లా పట్టి అడగాలన్నారు. రాష్ట్రంలో జనాభాకు, ప్రభుత్వ ఉద్యోగులు 1.4 శాతం మాత్రమే ఉన్నారన్నారు శ్రవణ్.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!