కేసీఆర్ సర్కార్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె గుర్తుచేశారు.
ఇక, దళిత బంధు కొత్తదేమీ కాదున్నారు ఎమ్మెల్యే సీతక్క.. దళితులకు ఇవ్వాల్సిన మూడెకరాల ఇవ్వకుండా ఇది ఇస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని విమర్శించిన ఆమె… సీఎం కేసీఆర్ పథకాల ప్రకటన తప్పా… అమలు చేసేది లేదంటూ ఎద్దేవా చేశారు.. ఇంద్రవెల్లిలో ఈ నెల 9వ తేదీన జరిగేది ఆత్మ గౌరవ సభ అని.. ఇక్కడి నుంచే ప్రభుత్వానికి డిక్లరేషన్ ఇస్తామని.. కేసీఆర్ సర్కార్ ను గద్దెదించే వరకూ పోరాటం చేస్తామని వెల్లడించారు సీతక్క.