Jaggareddy: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను! బరిలోకి ఆమె..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదంటూ అందరికి షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. ఒకవేళ క్యాడర్ వద్దంటే, తన సతీమణి నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో.. జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈనేపథ్యంలో.. ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు.
దీంతో.. సొంత పార్టీలో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఆయన నోరెత్తడం లేదు. కొద్దిరోజులుగా జగ్గారెడ్డి గాంధీభవన్కు కూడా రావడం లేదు. అయితే.. జగ్గారెడ్డి అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక బీజేపీ, టీఆర్ఎస్లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. గతంలో.. 2014 ఎన్నికల్లో ఓడిపోయి.. జగ్గారెడ్డి 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. జగ్గారెడ్డి తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపిస్తూ.. ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ఇక, ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన జగ్గారెడ్డి పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లినా.. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. మరి జగ్గారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ వర్గాల్లో మళ్లీ ఎలాంటి మార్పునకు దారితీస్తాయో వేచి చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!