Jagga Reddy : సమాధానాలు చెప్పలేకే రాహుల్ టీ షర్ట్పై చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని.. బీజేపీ టార్గెట్ చేస్తోంది.. పాదయాత్రలో ఉపయోగిస్తున్న కంటైనర్ల నుంచి అనేక రకాల విమర్శలు సందిస్తున్నారు.. అంతేకాదు.. రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్పై ఇప్పుడు చర్చ సాగుతోంది.. అయితే, రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద బీజేపీ మాట్లాడి దిగజారుడు పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీని ఏం విమర్శించాలో అర్దం కాక.. టీ షర్ట్ మీద విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాహుల్ గాంధీ.. బీజేపీ పెంచిన పెట్రో ధరలు, బ్లాక్ మనీ, ఉద్యోగాలపై అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీ షర్ట్ పై చర్చ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రోజుకు 20 లక్షల డ్రస్ లు మోడీ వేసినప్పుడు ఏమైంది.? అని ప్రశ్నించిన ఆయన.. రోజుకు మూడు డ్రెస్సులు మార్చే మోడీ ..60 లక్షలు ఖర్చు చేస్తున్నారు.. మోడీ ప్రజల సొమ్ముతో సోకులు పడుతున్నారు.. మోడీ 60 లక్షల ముందు రాహుల్ గాంధీ 40 వేల టీషర్ట్ ఎక్కడా..? అని ప్రశ్నించారు. మోడీ ప్రజల సొమ్ము ఖర్చు చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సొంత డబ్బులతో కొంటున్నారని తెలిపారు జగ్గారెడ్డి.
Read Also: Heavy Rains: ఏం వర్షాలు బాబోయ్.. 115 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేశాయి
Also Read
- Harish Rao : 'కరెంట్ ఉంటేనే వార్త'.. హరీష్ ఫైర్.!
- Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి నియోజక వర్గంలో 30 కిలీమీటర్ల మేర సాగుతుందని తెలిపారు జగ్గారెడ్డి.. ప్రారంభం నుండి ముగింపు వరకు… స్వాగతం పలికేందుకు ప్రజల్ని ఎక్కువ భాగస్వామ్యం చేస్తామన్న ఆయన.. పెట్రో, గ్యాస్ ధరలు భారం, అన్ని వర్గాల ప్రజలను రాహుల్ గాంధీ యాత్రలో భాగస్వామ్యం చేస్తాయన్నారు.. ఇక, ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నా.. ఇవాళ గాంధీ భవన్ లో జరిగే సమావేశానికి హాజరవుతానన్న ఆయన.. నియోజకవర్గానికి చెందిన పాదయాత్ర పై క్లారిటీ తీసుకుంటానని తెలిపారు. అయితే, శంషాబాద్ నుండి ముత్తంగి వరకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై యాత్ర వల్ల ఉపయోగం లేదన్నారు. ఆ రోడ్డు కంటే.. రాజేంద్ర నగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, పటాన్చెరు, సంగారెడ్డి మీదుగా వెళ్తే బాగుంటుందని.. దీనిపై పీసీసీతో మాట్లాడనున్నట్టు వెల్లడించారు జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!