TPCC Mahesh Goud : బండి సంజయ్ గెలుపు దొంగ ఓట్లతో సాధ్యమైంది
- బండి సంజయ్ గెలుపు దొంగ ఓట్లతోనే సాధ్యమైందన్న మహేష్ గౌడ్ ఆరోపణ
- బీఆర్ఎస్ మూడు ముక్కలు అయిపోయిందని వ్యాఖ్య
- ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పాదయాత్ర
- మోడీ ప్రజల మద్దతుతో కాకుండా దొంగనోట్లతో అధికారం లోకి వచ్చారని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ జనహిత యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడుతూ, జనహిత యాత్ర లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడమేనని చెప్పారు. కరీంనగర్లో బండి సంజయ్ గెలుపు దొంగ ఓట్లతో సాధ్యమైందని మహేష్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు కూడా దొంగ ఓట్లతో గెలిచారని అనుమానం వ్యక్తం చేశారు. బిసిల గురించి మాట్లాడడానికి బండి సంజయ్ ఢిల్లీకి పారిపోయారని, రాష్ట్ర సమస్యలపై స్పందించడం లేదని మండిపడ్డారు.
CM Revanth Rddy : టాలీవుడ్ లో కొత్త పాలసీ తెస్తాం.. సీఎం రేవంత్ ప్రకటన..
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
బీఆర్ఎస్ మూడు ముక్కలుగా చీలిపోయిందని, త్వరలో నాలుగో ముక్క కూడా బయటకు వస్తుందని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ తప్ప వేరే పార్టీకి అవకాశం లేదని, వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు తగ్గకుండా గెలిచి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనహిత పాదయాత్ర ప్రజల భవిష్యత్తు కోసం చేపట్టినదని, వారి సంతోషాలు, కష్టాలను పంచుకోవడమే లక్ష్యమని మహేష్ గౌడ్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ పదేళ్లలో ఇవ్వలేకపోయిందని, అయితే కాంగ్రెస్ ఏడాదిలోపే ఇళ్లు సిద్ధం చేస్తోందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రజల మద్దతుతో కాకుండా దొంగ నోట్లతో అధికారంలోకి వచ్చారని మహేష్ గౌడ్ విమర్శించారు. కులం, మతం, దేవుడు పేరుతో ఓట్లు అడగడం బీజేపీ అలవాటు అని, కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ అలా చేయలేదని చెప్పారు.
తాజావార్తలు
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!