Congress : వరంగల్ వర్ధన్నపేటలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. నేతల వ్యాఖ్యలతో జోష్
- వర్ధన్నపేటలో ఘనంగా జరిగిన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
- బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ కావడం గర్వకారణం.. కొండా సురేఖ
- బీజేపీ అరాచక పాలన, ఓటు చోరీ ఆరోపణలు.. మీనాక్షి నటరాజన్
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుంది.. మహేష్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహం నింపేలా నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, “వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటినుంచి మహేష్ కుమార్ గౌడ్ ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించేవారు. బీసీ బిడ్డగా ఆయనను పీసీసీ అధ్యక్షునిగా నియమించడం కాంగ్రెస్కు గర్వకారణం” అని అన్నారు. ఆమె అభిప్రాయపడ్డారు: మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో భాగమవ్వడం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కలిగిందని తెలిపారు.
Vijayawada: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఇక సంప్రదాయ దుస్తులు తప్పనిసరి!
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తూ అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. “బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఓటు చోరీకి పాల్పడింది. అదే తరహా వ్యూహంతో దేశంలో అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణలో మాత్రం ప్రజా పాలన కొనసాగుతోంది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉంది” అని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “ఈ పాదయాత్ర ప్రజల కోసం, జనహితం కోసం చేస్తున్నాం. ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి గొప్పనాయకుడనిపించుకునే వారిని ఓడిస్తామని చెప్పాం. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. పాదయాత్రలో ఆ నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రతో ఎనలేని బంధం ఉంది” అన్నారు.
అలాగే ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. “పదేళ్లు కేసీఆర్ ప్రజలను మోసం చేశాడు. దోచుకున్న సొమ్మును బయట పెట్టమంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు అన్న, చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలే మిగిలాయి. బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీల మీద మాకు అనుమానం ఉంది. వారు దొంగ ఓట్లతో గెలిచారు. ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి వత్తాసు పలుకుతుంది. బీజేపీ ఎంపీలు దొంగల్లా బుజాలు తడుముకుంటున్నారు” అని విమర్శించారు. అంతేకాకుండా, “నిజామాబాద్ ఎంపీ స్థానంలో మహారాష్ట్ర, తెలంగాణ ఓటర్లు ఇద్దరూ ఉన్నారు. రెండు చోట్ల ఒకేసారి ఓటు వేయడం ఎలా సాధ్యం?” అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు పైగా గెలుస్తుందని, వర్ధన్నపేటలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామని గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
KTR : రేవంత్ చేసే ప్రతీ తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!