CM Revanth Reddy: నేడు అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ లో సీఎం పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కీలక నేతలంతా ప్రచారంలో బిజీ బిజీ అయ్యారు. రాష్ట్రంలోని మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను పీసీసీ ప్రకటించింది. నేటి నుంచి 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్ను వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నం రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రచారం చేస్తారు.
Read also: Sabarimala: రోజుకు 80 వేల మందికే శబరిమల అయ్యప్ప దర్శన భాగ్యం
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
రేపు (ఈ నెల 7వ) తేదీ ఉదయం 11 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో సీఎం పాల్గొని నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. వెంటనే రాత్రి 7.45 గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 8న సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొని జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్ జనజాతర సభలో, సాయంత్రం 6 గంటలకు ఎల్ బీ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి జన జాతర సభ, సాయంత్రం 4 గంటలకు తాండూరు జన జాతర సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు.
Pragya Jaiswal : అప్పుడు చేజారిన అవకాశం..ఇన్నాళ్లకు మళ్ళీ వచ్చింది..
తాజావార్తలు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!