CM Revanth Reddy : క్యూర్-ప్యూర్-రేర్తో డెవలప్మెంట్ మోడల్
- 2047 లక్ష్యంగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
- క్యూర్-ప్యూర్-రేర్తో డెవలప్మెంట్ మోడల్
- కృష్ణా జలాలపై ఏపీతో చర్చలకే ప్రాధాన్యం
- హైదరాబాద్ను గ్లోబల్ ఫ్యూచర్ సిటిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరం నేడు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందంటే అది గత మూడు దశాబ్దాల (1995-2025) నిరంతర శ్రమ ఫలితమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసిన సుజెన్ మెడికేర్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్లో భాగంగా ఇటువంటి తయారీ యూనిట్లు రావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం క్యూర్ (Cure), ప్యూర్ (Pure), రేర్ (Rare) అనే మూడు విభాగాలుగా అభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్లు సీఎం తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ను విడుదల చేశామని, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్లో 40 శాతం వాటా తెలంగాణదేనని, ఫార్మా రంగంలో ప్రపంచమే మన వైపు చూసేలా ఎదుగుతున్నామని గర్వంగా చెప్పారు.
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
రాజకీయ వివాదాల కంటే సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను” అని వ్యాఖ్యానిస్తూ, కృష్ణా నది జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్దని, అడ్డంకుల వల్ల కేంద్ర నిధులు రాక రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలన్నా, నీటి సమస్యలు తీరాలన్నా ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల సహకారం అవసరమని, అందుకే తాము వివాదాల కంటే సామరస్యపూర్వక చర్చలకే మొగ్గు చూపుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల , రైతుల ప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్లోని ‘ఫ్యూచర్ సిటీ’లో నివసిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలతో పోటీ పడుతూ తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్గా మార్చడమే తమ సంకల్పమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్ పెట్టండి.!
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..