CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో పోలీస్ శాఖ పోషించాల్సిన పాత్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సమాజం ఎదుర్కొంటున్న ఆధునిక సవాళ్లను పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా సమస్యను లోతుగా అధ్యయనం చేసి, అందులోని సాంకేతిక అంశాలను అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారం లభిస్తుందని, అలా అవగాహన పెంచుకున్నప్పుడే 50 శాతం సమస్య పరిష్కారం అయినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
High Protein Soya Chilla Recipe: మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్.. సోయా చిల్లా రెసిపీ సింపుల్గా ఇలా..
ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్, సైబర్ క్రైమ్ , లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. శాంతిభద్రతలు బలంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేర స్వభావం పూర్తిగా మారిందని, భౌతిక నేరాల కంటే సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ సాక్ష్యాలు కీలకంగా మారిన ఈ రోజుల్లో, సాంకేతిక నైపుణ్యం కలిగిన అధికారుల అవసరం ఎంతైనా ఉందని, అధికారులు నిరంతరం అప్గ్రేడ్ అవ్వాలని సూచించారు.
Gen Z Reality : 23 ఏళ్లకే పచ్చి తాగుబోతులుగా మారుతున్న యువత..!
దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరాలు కాలుష్యంతో అల్లాడుతున్న తరుణంలో, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాలని పిలుపునిచ్చారు. కేవలం రెండు సెంటీమీటర్ల వర్షం పడితేనే నగరం స్తంభించిపోయే పరిస్థితి ఉండకూడదని, అత్యవసర సమయాల్లో ప్రజలకు ఆపద్బాంధవుల్లా కనిపించే పోలీసులు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలని కోరారు. అలాగే, పోలీసులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించేందుకు జనాభా ప్రాతిపదికన కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా ‘త్రీ లేయర్’ పోలీస్ వ్యవస్థను తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
పోలీస్ సంక్షేమం , పోస్టింగ్ల విషయంలో తన ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అనుసరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో పోస్టింగ్ల కోసం పైరవీలు జరిగే పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు కేవలం మెరిట్ , కేటగిరీ ఆధారంగానే బాధ్యతలు అప్పగిస్తున్నామని గుర్తుచేశారు. పోలీస్ అధికారులు కేవలం పై స్థాయి ఆదేశాలను పాటించడమే కాకుండా, కింది స్థాయి సిబ్బందితో చర్చించి వారి సమస్యలను వినాలని, అలా చేసినప్పుడే వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయని సూచించారు. ప్రభుత్వ ఖజానా పరిస్థితి దృష్ట్యా నిధులను సక్రమంగా వినియోగించాలని కోరుతూ, పోలీస్ శాఖను ఆధునీకరించేందుకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోగతిలో పోలీస్ శాఖను భాగస్వాములను చేస్తూ, తదుపరి రీట్రీట్ కార్యక్రమాన్ని 2026 డిసెంబర్లో నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.