CM Revanth Reddy: ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి… సోనియా గాంధీతో భేటీ..
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది..
- కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్- డిప్యూటీ సీఎం భట్టి..
- అనంతరం రాహుల్ గాందీతో భేటీ అయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల పై సోనియా గాంధీతో చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాగాంధీ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరించారు. అనంతరం పార్టీ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించి వరంగల్లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని వరంగల్ సభకు ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఎన్నికల సమయంలోనే వరంగల్ అసెంబ్లీలోనే రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం నాడు ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఈరోజు రాహుల్ గాంధీని కలిసి వరంగల్ సభకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.
Read also: Coal Production: ఓపేన్ కాస్ట్ లోకి చేరిన భారీగా వర్షపు నీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
రాహుల్తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ఏఐసీసీ అగ్రనేతలను ఈ సమావేశానికి ఆహ్వానించే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఆదివారం వరంగల్ లో కృతజ్ఞత సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ తర్వాత క్లారిటీ రానుంది. కాగా.. మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి సీఆర్పాటిల్తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై వీరిద్దరూ కేంద్రమంత్రితో చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నిన్న రాత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై నేడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కార్యాలయంలో ఇంజినీర్ల స్థాయిలో సమావేశం జరగనుంది.
Chaitanya Reddy : హనుమాన్ మేము అనుకున్నంత కలెక్షన్లు రాలేదు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!