Ponnam Prabhakar: అమ్మవారు విగ్రహం ఏర్పాటుపై సీఎం, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది..
- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది బోనాలకు ఘనంగా జరిగాయి..
- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం..
- ప్రతి ఆలయానికి నిధులు కేటాయించడం జరిగింది..
- గతం కన్నా ఎక్కువ నిధులు బోనాల పండుగకు మంజూరు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయన్నారు. రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోందన్నారు. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైందన్నారు. విగ్రహం మార్పు పై ముఖ్యమంత్రి తో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది బోనాలకు ఘనంగా జరిగాయన్నారు. గోల్కొండ లో తోలి బోనం తో ప్రారంభమై..బల్కం పేట ఎల్లమ్మ బోనాలు.. ఉజ్జయిని మహంకాళి బోనాలు.. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో హైదరాబాద్ బోనాలు ముగుస్తాయన్నారు.
Read also: Rangam Bhavishyavani: రక్త పాశం ఇవ్వడం లేదు.. మీకు నచ్చింది ఇస్తున్నారు..
Also Read
- BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
- SHAKTI : తెలంగాణలో కార్మిక, ఉపాధి శాఖ పేరు మార్పు.. ఇకపై ‘శక్తి’ శాఖగా..
- Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
- Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
ప్రభుత్వ యంత్రాంగం బోనాల ఉత్సవాలలో అత్యంత శ్రమపడి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన, ప్రజల అందరు సహకారం అందించారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఆలయానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గతం కన్నా ఎక్కువ నిధులు బోనాల పండుగకు మంజూరు చేశామన్నారు. ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. భవిష్యవాణి లో అమ్మవారి చెప్పినట్లు వర్షాలు సంవృద్దిగా కురిసి.. ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలి అని అమ్మవారు చెప్పారన్నారు. అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం రేవంత్ రెడ్డి,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
YSRCP MLAs Black Scarves: నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు.. పోలీసులపై జగన్ ఫైర్..!
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!