CM Revanth Reddy : పేదల ఆశయమే మా ఆత్మగౌరవం
- ఖమ్మం ఉద్యమ చరిత్రను గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- “ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదు”.. పేదల కోసం హామీ
- పొంగులేటికి కీలక శాఖల బాధ్యతలు అప్పగించిన సీఎం
- “పేదల సంతోషమే మా ఆత్మగౌరవం”.. కాంగ్రెస్ పేదల పార్టీ అని పునరుద్ఘాటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఖమ్మం ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తు చేస్తూ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం అని ఆయన అన్నారు. ప్రతి అంశంలో తొలుత స్పందించే చైతన్యం ఉన్న జిల్లా ఇది అని, కమ్యూనిస్టు సోదరులు కూడా మనతో అండగా నిలిచారు అని ఆయన అన్నారు.
ఈ సభలు ఎన్నికల కోసం కాదని స్పష్టం చేస్తూ, పేదల సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి వేదికలు అవశ్యకమని ఆయన పేర్కొన్నారు. “పదేళ్లుగా ఇళ్ల కోసం పేదలు ఎదురుచూశారు. స్వంత ఇంటి కలను 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెరవేర్చారు. హనుమాన్ గుడి లేని ఊరు ఉండవచ్చు, కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం మాత్రం ఉండదు” అని సీఎం వ్యాఖ్యానించారు.
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
Vijayawada: మద్యం మత్తులో యువతితో గొడవ పడిన కానిస్టేబుల్.. అడ్డుకున్న మరో కానిస్టేబుల్…
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎటువంటి తప్పు జరుగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. “సమర్థుడైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గౌడ్ రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలు ఆయన్ని నడిపిస్తున్నాయి. ఈ శాఖలు నా వద్ద పెట్టుకోవచ్చు కానీ ప్రజల కోసం పొంగులేటి కి ఇచ్చాను” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పేదల పార్టీ అని మరోసారి పునరుద్ఘాటిస్తూ, “మేము పేదరికంలో పుట్టాం. పేదరికం ఏమిటో మాకు తెలుసు. పేదల కష్టాలు మాకు బాగా అర్థం” అని సీఎం అన్నారు. మరోవైపు, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తూ, “బీఆర్ఎస్ అనే పాములో కాలకుట్టిన విషం ఉంది. ఆ పామును చంపేశాం, మళ్లీ చూపాల్సిన అవసరం లేదు. వారు బంగళాలు, ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ మేము పేదలకు ఇళ్లు, సన్నబియ్యం ఇస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.
ఖమ్మం నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేసిన సీఎం, “IAS లు కావాలి, చదువుకోవాలి – ఇదే మా నినాదం. పేదల కళ్లల్లో ఆనందం చూడటమే మా నిజమైన సంపద” అని చెప్పారు. “ఒకనాడు జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు కలిగిన ఆనందం కన్నా, పేదరికంలో ఉన్నవారు స్వంత ఇల్లు పొందినప్పుడు వారి కళ్లల్లో కనిపించే సంతోషమే నాకు గొప్పది” అని ముఖ్యమంత్రి అన్నారు.
YS Jagan: ఏపీలో యారియా కొరతపై.. మాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!