New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం … షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Secretariat: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 30న సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగా ఉదయం 6 గంటల తర్వాత సుదర్శన యాగం నిర్వహిస్తారు. యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి చేస్తారు. ఆ తర్వాత కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ నేరుగా 6వ అంతస్తులోని తన ఛాంబర్లోకి ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య శుభ ముహూర్తం ఉండడంతో అధికారులు తమకు కేటాయించిన గదుల్లోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో ఫైలుపై సంతకం చేయాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు పంపారు. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవ వేడుక. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు.సచివాలయానికి నాలుగు దిశల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు మాత్రమే ఉత్తర, పశ్చిమ ద్వారాలను తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు మరియు అధికారులు ఈశాన్య ద్వారం గుండా ప్రవేశిస్తారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ఆగ్నేయ ద్వారం వద్ద సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. తూర్పు ద్వారం (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, ముఖ్య ఆహ్వానితులు మరియు విదేశీ అతిథులకు మాత్రమే ఉపయోగించబడుతుంది.వికలాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సచివాలయంలోకి ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. సచివాలయ భద్రతకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి భద్రతా చర్యలు తీసుకుంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.
Focus on farmers: అందరి చూపు రైతుల వైపు.. రైతులకు భరోసా ఇవ్వడానికి కసరత్తు
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!