New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం … షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Secretariat: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 30న సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగా ఉదయం 6 గంటల తర్వాత సుదర్శన యాగం నిర్వహిస్తారు. యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి చేస్తారు. ఆ తర్వాత కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ నేరుగా 6వ అంతస్తులోని తన ఛాంబర్లోకి ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య శుభ ముహూర్తం ఉండడంతో అధికారులు తమకు కేటాయించిన గదుల్లోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో ఫైలుపై సంతకం చేయాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు పంపారు. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవ వేడుక. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు.సచివాలయానికి నాలుగు దిశల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు మాత్రమే ఉత్తర, పశ్చిమ ద్వారాలను తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు మరియు అధికారులు ఈశాన్య ద్వారం గుండా ప్రవేశిస్తారు.
Also Read
ఆగ్నేయ ద్వారం వద్ద సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. తూర్పు ద్వారం (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, ముఖ్య ఆహ్వానితులు మరియు విదేశీ అతిథులకు మాత్రమే ఉపయోగించబడుతుంది.వికలాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సచివాలయంలోకి ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. సచివాలయ భద్రతకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి భద్రతా చర్యలు తీసుకుంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.
Focus on farmers: అందరి చూపు రైతుల వైపు.. రైతులకు భరోసా ఇవ్వడానికి కసరత్తు
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!