CM KCR: రైతు సంఘాల నేతలతో నేడు సీఎం కేసీఆర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు సంఘాల నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ నుంచి వచ్చిన 100 మంది రైతు సంఘాల నేతలు కేసీఆర్ను కలవనున్నారు.. ఇప్పటికే గౌరారం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్నిపరిశీలించిన రైతు సంఘాలు ప్రతినిధులు, మల్లన్నసాగర్, టాంక్ బండ్, పంప్ హౌజ్ను పరిశీలించారు.. ఇవాళ జాతీయ రైతు సంఘం నేత టికాయత్ సహా మరి కొంతమంది నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో రైతు సంఘాలను ఢిల్లీ నేతలు సమన్వయం చేస్తున్నారు. అయితే, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాం.. జెండా ఎత్తుతున్నాం అంటూ.. ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా.. కేసీఆర్ చెబుతూ వస్తున్నారు.. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించడంపై ఆసక్తిగా మారింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
ఇక, తెలంగాణలోని ప్రాజెక్టులను సందర్శించిన రైతులు.. మరోవైపు రాష్ట్రంలో అమలవుతోన్న రైతు సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణను అమలు పరుస్తున్న తెలంగాణ రాష్ట్రం వైపు రైతు ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తున్నది. రైతుబంధు ద్వారా పంటసాయం, రైతు కుటుంబాల్లో భరోసాను నింపే రైతు బీమాతో పాటు, 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు పుష్కలమైన నీరందించడంతోపాటు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయం పట్ల దేశ రైతాంగం ఆసక్తిని కనబరుస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు.. హైదరాబాద్ చేరుకుని.. ఆ తర్వాత.. వివిధ ప్రాజెక్టులను పరిశీలించారు.
మరోవైపు.. తెలంగాణలో అమలవుతోన్న రైతు సంక్షేమ పథకాలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. రైతు సంఘాల నేతలు.. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓ రైతు నాయకుడు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎకరానికి రూ. 10 వేల రైతుబంధు సాయం, రూ. 5 లక్షల రైతు బీమా సాయం అందించడం దేశ రైతు చరిత్రలోనే గొప్ప పరిణామంగా పేర్కొన్నారు.. దేశ వ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు, సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడు అని కొనియాడారు రైతు సంఘాల నేతలు..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!