ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బీహార్ పర్యటన ఇలా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆయన బిజీబిజీగా గడిపారు. బీహార్ పర్యటన కోసం, బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీహార్ పర్యటనకు బయలుదేరే ముందు..ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు, ప్రగతి భవన్ లో వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, కల్వకుంట్ల హిమాంశు తదితరులు పాల్గొన్నారు.
*12 : 00 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి పాట్నాకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ బృందం..
* 01 : 54 గంటలకు పాట్నా జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసిఆర్…
* 02 : 10 గంటలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్, ఘనస్వాగతం పలికి వేదిక పైకి తీసుకెళ్ళిన బీహార్ ముఖ్యమంత్రి..
* 02 : 18 గంటలకు అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన సమావేశం..
* 02 : 30 గంటలకు ప్రారంభమైన చెక్కుల పంపిణీ కార్యక్రమం..
* చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ప్రసంగించిన తేజస్వి యాదవ్
అనంతరం..
Read Also:CM KCR: బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి.. అంతా కలిసి పనిచేస్తాం
* 02 : 46 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగం..
అనంతరం.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగం
* 03 : 26 గంటలకు లంచ్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్
*05 : 20 గంటలకు ఇరువురు ముఖ్యమంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్ ..
* మీడియా నుద్దేశించి మాట్లాడిన సీఎం కేసిఆర్
* 06 : 01 గంటలకు ముగిసిన ప్రెస్ కాన్ఫరెన్స్.. సీఎం కేసిఆర్ ను సత్కరించిన బీహార్ సీఎం..
అనంతరం..
* 06 : 12 గంటలకు తేజస్వి యాదవ్ నివాసానికి వెళ్ళిన సీఎం కేసీఆర్.
*06 : 44 గంటలకు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసం నుండి పాట్నా గురుద్వారకు బయలుదేరిన సీఎం కేసీఆర్
*07 : 02 గంటలకు పాట్నా గురుద్వారకు చేరుకున్న సీఎం కేసీఆర్…
*07 : 22 గంటలకు గురుద్వారాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కేసిఆర్. ప్రత్యేక పూజల అనంతరం…
*08 : 07 గంటలకు గురుద్వారా నుండి పాట్నా విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్
*08 : 23 గంటలకు పాట్నా విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్
Read Also:CM KCR Meets LaluPrasad Yadav: లాలూప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ భేటీ