CM KCR: బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి.. అంతా కలిసి పనిచేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం బాగుపడాలంటే బీజేపీ ముక్త్ భారత్ సాధించాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు..ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తీసుకువస్తున్నారు…మోడీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ? దేశంలో వినాశకరమైన పరిస్థితిని బీజేపీ తీసుకువచ్చింది…విపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని నితిష్ కుమార్ అన్నారు …విపక్షాలు కలసి బీజేపీ ముక్త్ భారత్ కోసం పనిచేయాలని అనుకున్నాం అన్నారు సీఎం కేసీఆర్..మోడీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ? దేశంలో వినాశకరమైన పరిస్థితి ని బీజేపీ తీసుకువచ్చింది
విపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని నితీష్ కుమార్ అన్నారు..విపక్షాలు కలసి బిజెపి ముక్త్ భారత్ కోసం పనిచేయాలని అనుకున్నాం..బిజెపి ముక్త్ భారత్ తోనే దేశంలో పురోగతి సాధ్యం అన్నారు కేసీఆర్. మోడీ విధానాలతో దేశం నుంచి వ్యాపారులు పారిపోతున్నారు..దేశంలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయి..దేశం అప్పులు పెరిగాయి…రూపాయి విలువ పడిపోయింది..దేశ రక్షణ వ్యవహారాల విషయంలో ఎటువంటి సంప్రదింపులు లేకుండా కొత్త విధానాలు తీసుకువస్తున్నారు.. దేశ రాజధానిలో ఇప్పటికి నీటి,కరెంట్ కొరత ఉంది… మోడీ సర్కార్ అసమర్థ విధానాలతో దేశం తిరోగమన దిశలో వెళ్తుందని దుయ్యబట్టారు సీఎం కేసీఆర్.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
బీహార్ సీఎం నితీష్ కుమార్ సీఎం కేసీఆర్ ని ఆకాశానికెత్తేశారు. సీఆర్ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు…మీరు వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగండి…మీ భాగస్వామ్యం చాలా గొప్పది…మీ ద్వారా తెలంగాణ అనే ఒక రాష్ట్రమే ఏర్పడింది….ఈ దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెక్కడా లేదు…అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒక్కరు…మీరు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహా నేత అని కొనియాడారు నితీష్ కుమార్.
అలాంటి మీ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ విమర్శలన్నీ ఫాల్తు మాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకుంటారు. వదులుకునే ప్రసక్తే ఉండదు. మీరు పట్టువదలకుండా మరింత శక్తి కూడగట్టుకొని మీ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించండని కితాబిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్.బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర ఎందుకన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. విస్తృతంగా చర్చ జరిగాక నిర్ణయానికి వస్తాం. రైతులు ఇబ్బంది పడుతున్నారు. జాతీయ జెండాతో సహా అన్నీ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అంతా ఒక తాటిపైకి వచ్చాం.. తప్పుడు విద్యుత్ విధానం అమలుచేస్తోందన్నారు సీఎం కేసీఆర్.
Read Also: New Zealand: న్యూజిలాండ్కు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్రౌండర్
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!