Nellore Crime: పీఎస్లో ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో మృతి.. పోలీసుల వేధింపులే కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Crime: నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆకాష్ అనే యువకుడు తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆకాశ్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ.. మిత్రులు.. కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించారు. ఒక కేసు విచారణ నిమిత్తం ఆకాష్ మీ పలుమార్లు స్టేషన్.కు పిలిచి ఎస్.ఐ. నాగబాబుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీసులపై చర్య తీసుకునే వరకూ ఆందోళన విరమించబోమని కుటుంబ సభ్యులు.. స్థానిక ప్రజలు స్పష్టం చేశారు.. దీంతో ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని బంధువులతో చర్చలు జరిపారు. సైదాపురంలో పరిస్థితిని జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డికి తెలియజేయడంతో ఆయన స్పందించారు.
Read Also: Rashmika: మేనేజర్ మోసం.. స్పందించిన రష్మిక
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
పోలీస్ స్టేషన్లోనే ఆత్మ హత్యాయత్నానికి పాల్పడటంలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని గుర్తించారు. కస్టోడియల్ డెత్ గానే భావించి ఎస్ఐ నాగబాబు.. కానిస్టేబుల్ వీరభద్రంలను సస్పెండ్ చేశారు. ఘటనపై కావలి డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. ఈ విషయాన్ని డీఎస్పీ తెలియజేసినా వారు శాంతించలేదు. ఎస్.ఐ.ని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేయడంతో సైదాపురం.. రాపూరు రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు నచ్చ చెబుతున్నా ఆందోళన కారులు అంగీకరించలేదు. ఆకాష్ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని పట్టుపట్టారు.. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కోటారెడ్డి హామీ ఇచ్చారు. ఆందోళనకారులతో డీఎస్పీ చర్చలు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!