Munugode Bypoll: సీఎంతో నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ.. భవిష్యత్తులో నేతలందరికీ అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode Bypoll: నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి 14 వరకుకొనసాగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం ప్రభాకర్ ను గెలిపించాలని కోరారు. టికెట్ ఆశించడం తప్పుకాదని, తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందని కేసీఆర్ అన్నారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తామని అన్నారు.
Read also: Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ యాక్సిడెంట్.. గేదెల యజమానుల కోసం గాలింపు
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
ఇక టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో కుసుకుంట్ల ప్రభాకర్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలని కోరుతున్నామని తెలిపారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ బలోపేతం కోసమే అని అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. తను కేసీఆర్ నుంచి ఏమి ఆశించలేదని పేర్కొన్నారు. అందరిలాగా నేను టికెట్ ఆశించా! నాకు ఆహక్కు ఉందని తెలిపారు. కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు. అయితే.. ఇవాళే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బిపార్మ్ ఇవ్వనున్న కేసీఆర్ తెలిపారని అన్నారు.
సీఎం కేసీఆర్తో నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ అనంతరం సీఎం మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్లు ఆశించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు ఉంటాయని హామీఇచ్చారు. ఈనేపథ్యంలో.. సీఎం వారికి సర్దిచెప్పడంతో, నర్సయ్య.. కర్నె ప్రభాకర్ కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
Somasila Project: సోమశిల జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..