US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
- పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం
- ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్పై అమెరికా బాంబులు
- ఇరాన్ తీవ్ర నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Airstrikes on Iran: హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఈ దాడులను ఆమోదయోగ్యం కాదని పేర్కొన్న అమెరికా, ఇరాన్పై వైమానిక దాడులను పునఃప్రారంభించినట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.
ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్లో భారీ పేలుళ్లు
ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, దక్షిణ ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. సిరిక్ పట్టణంలో వరుసగా ఏడు పేలుళ్లు సంభవించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ప్రెస్ టీవీ సమాచారం ప్రకారం, సిరిక్లోని తాహెరుయ్ రేవు ప్రాంతంలో ఆరు క్షిపణులు పడ్డాయని పేర్కొంది. ఈ దాడుల కారణంగా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, రేవు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించినట్లు సమాచారం.
Also Read
- Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
- UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
దాడులను ధృవీకరించిన సెంట్కామ్
అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా ఈ దాడులను అధికారికంగా ధృవీకరించింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. “వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు అన్యాయమైనవి, ప్రమాదకరమైనవి. అవి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి” అని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఇరాన్ తీవ్ర నిరసన
అమెరికా దాడులు అంతర్జాతీయ అవగాహన ఒప్పందాల ఉల్లంఘన అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ దాడులకు అమెరికా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఇరాన్ విడుదల చేసిన ప్రకటనలో “మా జాతీయ ప్రయోజనాలను, జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము” అని హెచ్చరించింది.
హార్ముజ్ జలసంధి ప్రాధాన్యం
ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధిలో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ప్రపంచ చమురు సరఫరాలో అధిక భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఇటీవలి నౌకాదాడుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు ఉత్పత్తి, అమ్మకాల కోసం జారీ చేసిన సాధారణ లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం.
మళ్లీ యుద్ధ భయం
హార్ముజ్ జలసంధి వద్ద జరిగిన ఘటనలతో పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం మళ్లీ నెలకొంది. అమెరికా వైమానిక దాడులు, ఇరాన్ ప్రతిస్పందన హెచ్చరికలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లు, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!