కేసీఆర్ దసరా శుభాకాంక్షలు.. రేవంత్, సంజయ్, కిషన్రెడ్డి విషెస్..
రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకగా అభివర్ణించిన ఆయన.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు.. ఇక, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా ప్రార్థించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్..
మరోవైపు.. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి ఆకాంక్షించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణలో అత్యంత పవిత్రమైన పండుగ, గ్రామాలలో వైభవంగా నిర్వహించుకునే దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో తరతమ భేదం లేకుండా అంత కలిసి జరుపుకునే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పండుగ దసరా అని, ప్రజలు ఆనందంగా, సుఖ శాంతులతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు రేవంత్రెడ్డి..
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.. హిందూ బంధువులకు దసరా(విజయ దశమి) పండుగ శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్.. చెడు ఎంత బలమైనదైనా, ఎంతటి దుర్మార్గమైనదైనా చివరికి మంచే విజయం సాధిస్తుందని ఈ విజయ దశమి సూచిస్తుందని పేర్కొన్నారు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ప్రయోజనాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 100 లక్షల కోట్లతో ప్రధాని గతిశక్తి అభివృద్ధి ప్రణాళికలకు రూపొందించిన ప్రణాళికలు మోడీ లక్ష్యం ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా, శక్తివంతమైన దేశంగా రూపొందాలన్న ఆకాంక్ష సంపూర్ణం కావాలని ఈ విజయదశమి విజయం చేకూర్చాలని ఆకాంక్షించారు.. మరోవైపు.. దేశ ప్రజలకు దసరా(విజయ దశమి) శుభాకాంక్షలు తెలిపారు కిషన్రెడ్డి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో విజయం సాధించడానికి దేశ ప్రజల సహకారం ,భాగస్వామ్యం లభించడం, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తూ ఉండడం గొప్ప విజయంగా అన్నారు.. శక్తి స్వరూపిణి దయతో దేశ ప్రజలు ఈ విజయదశమిని ఆనందోత్సహాలతో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు కిషన్రెడ్డి.
తాజావార్తలు
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!