Farmers Loan: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. నేటి నుంచే రుణమాఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Loan: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండో వారంలోగా అంటే పదిహేను రోజుల్లో పూర్తిగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీతో పాటు రైతులకు మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఎఫ్ఆర్బీఎం నిధులు విడుదల కాకపోవడం, తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష వంటి కారణాలతో గత కొన్నేళ్లుగా ఆర్థిక లోటు కారణంగా కొంత జాప్యం జరుగుతోందని కేసీఆర్ అన్నారు.
Read also: Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్రావు, ముఖ్య సలహాదారు సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు పాల్గొన్నారు. హామీ మేరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగించాం.కరోనా వంటి అనూహ్య అవాంతరాలు, ఎఫ్ఆర్బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్ష కోత, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధులపై కక్ష సాధింపు చర్యల కారణంగా రైతు రుణమాఫీ కార్యక్రమం ఆలస్యమైంది. కొంత కాలం.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుంది.. ప్రభుత్వం ఇప్పటికే చెప్పినట్లు రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను విస్మరించే ప్రసక్తే లేదు.. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా.. ఆదర్శ కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. వ్యవసాయాభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పినట్లే.. రైతులు సాధికారత సాధించి ఆర్థికంగా ఎదిగే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
Pulses Price: టమాటాలు, మసాలా దినుసుల బాటాలోనే పప్పుల ధరలు.. కిలోకు రూ.30 పెరిగింది
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!