Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Personal Finance Pulses Price Hike Pulses Become Costlier

Pulses Price: టమాటాలు, మసాలా దినుసుల బాటలోనే పప్పుల ధరలు.. కిలోకు రూ.30 పెరిగింది

Published Date :August 3, 2023 , 8:54 am
By Rakesh Reddy
Pulses Price: టమాటాలు, మసాలా దినుసుల బాటలోనే పప్పుల ధరలు.. కిలోకు రూ.30 పెరిగింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pulses Price: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పచ్చి కూరగాయలు, మసాలా దినుసులతో పాటు చాలా వరకు ఆహార పదార్థాలు కూడా ఖరీదైనవిగా మారాయి. దీంతో సామాన్య ప్రజల జేబుపై ద్రవ్యోల్బణం భారం పెరిగింది. కూరగాయలు, మసాలా దినుసులతో పాటు పప్పుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పేద ప్రజలు పప్పులు తినడం కూడా కలగానే మారుతోంది. అధిక ధరల కారణంగా చాలా మంది పప్పులు కొనడమే మానేశారు.

Read Also:Megastar Chiranjeevi : ఏంటి..చిరంజీవి చేతికి పెట్టుకున్న ఈ వాచ్ అన్ని కోట్లా..?

Also Read

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

గత నెల రోజులుగా పప్పుల ధరలో గరిష్ట పెరుగుదల నమోదైంది. కందిపప్పు అత్యంత ఖరీదైంది. నెలరోజుల క్రితం వరకు 100 నుంచి 120 రూపాయలు పలికిన కందుల ధర ఇప్పుడు దాదాపు 200 రూపాయలకు పెరిగింది. దీంతో కందిపప్పు సామాన్య ప్రజల ప్లేట్ నుంచి కనుమరుగైంది. అయితే పెరుగుతున్న పప్పుల ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ధరలు మెరుగుపడడం లేదు. గత మార్చి నుంచి పప్పుల ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. పప్పుధాన్యాల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను పర్యవేక్షించడానికి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వ్యాపారులు పప్పు దినుసులను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో మండీలకు పప్పుల రాక తగ్గి ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత కమిటీ రాష్ట్ర అధికారులతో కలిసి తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అయినప్పటికీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పప్పుధాన్యాల నిల్వ పరిమితిని నిర్ణయించింది.

Read Also:Lakshmi Devi Signs: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా?.. త్వరలోనే మీ ఇళ్లు డబ్బుతో నిండిపోతుంది!

కేంద్ర ప్రభుత్వం పప్పుధాన్యాల నిల్వ పరిమితిని జూన్ 2న నిర్ణయించింది. పప్పుధాన్యాల స్టాక్ పరిమితి జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని, ఇది అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా వ్యాపారి నిర్ణీత పరిమితికి మించి పప్పులను నిల్వ ఉంచినట్లయితే, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ నిబంధన టోకు వ్యాపారులు, రిటైలర్లు, మిల్లు యజమానులతో పాటు దిగుమతిదారులకు కూడా వర్తిస్తుంది. రిటైల్ వ్యాపారులు 5 టన్నులకు మించి పప్పుధాన్యాలను నిల్వ చేయరాదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. టోకు వ్యాపారులు, దిగుమతిదారులు 200 టన్నుల కంటే ఎక్కువ పప్పులను నిల్వ చేయలేరు. ఒక రకమైన పప్పుధాన్యాల స్టాక్ 100 టన్నుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పప్పులు ధర పెరుగుతూనే ఉన్నాయి.

Read Also:Cab Driver Extorts: ఫోన్‌లో ‘ఎఫైర్’ మాటలు విన్నాడు.. మహిళని బెదిరించి 22 లక్షలు దోచేశాడు

పప్పుల ధర కిలోకు ఇలా..
పప్పు – ఒక నెల క్రితం ధర – ప్రస్తుత ధర
కందిపప్పు – రూ. 170- 180 – రూ. 190-200
పెసరపప్పు – రూ 150-160 – 160- 180
ఎర్రపప్పు- రూ.110 – రూ.120-140
శనగపప్పు- రూ.90 – రూ. 100
మినప పప్పు – రూ.150 – రూ.160-180
పెసర పప్పు హోల్ సేల్- రూ .110-120 – రూ ..120-130

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • food inflation
  • inflation
  • price of arhar dal
  • price of pulses
  • pulses price

తాజావార్తలు

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions