Farmers Loan: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. నేటి నుంచే రుణమాఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Loan: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండో వారంలోగా అంటే పదిహేను రోజుల్లో పూర్తిగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీతో పాటు రైతులకు మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఎఫ్ఆర్బీఎం నిధులు విడుదల కాకపోవడం, తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష వంటి కారణాలతో గత కొన్నేళ్లుగా ఆర్థిక లోటు కారణంగా కొంత జాప్యం జరుగుతోందని కేసీఆర్ అన్నారు.
Read also: Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్రావు, ముఖ్య సలహాదారు సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు పాల్గొన్నారు. హామీ మేరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగించాం.కరోనా వంటి అనూహ్య అవాంతరాలు, ఎఫ్ఆర్బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్ష కోత, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధులపై కక్ష సాధింపు చర్యల కారణంగా రైతు రుణమాఫీ కార్యక్రమం ఆలస్యమైంది. కొంత కాలం.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుంది.. ప్రభుత్వం ఇప్పటికే చెప్పినట్లు రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను విస్మరించే ప్రసక్తే లేదు.. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా.. ఆదర్శ కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. వ్యవసాయాభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పినట్లే.. రైతులు సాధికారత సాధించి ఆర్థికంగా ఎదిగే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
Pulses Price: టమాటాలు, మసాలా దినుసుల బాటాలోనే పప్పుల ధరలు.. కిలోకు రూ.30 పెరిగింది
తాజావార్తలు
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!