
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్న కేసీఆర్ కొన్నిరోజులు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో కేసీఆర్ తిరిగి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఏప్రిల్ 20 వ తేదీ నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతున్నది. మే 8 వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుండటంతో దీనిపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.