Vivek Venkataswamy: తుగ్లక్ నిర్ణయాలతో.. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Destroyed Telangana With Tuglak Decisions Says Vivek Venkataswamy: తెలంగాణ సీఎం కేసీఆర్పై మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తుగ్లక్ నిర్ణయాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు. మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీస్లో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని పూర్తిగా మరిచిపోయారన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని మాటిచ్చిన కేసీఆర్.. కేవలం తన కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారం చేసేందుకే పని చేస్తున్నారని, ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిన కేసీఆర్.. తన కుటుంబానికి చెందిన ఆరుగురికి మాత్రం పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదని వివేక్ వెంకటస్వామి చెప్పారు. రైతులకు ఫ్రీ ఫెర్టిలైజర్స్, ఉచిత విద్య, దళితులకు మూడెకరాలు ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్న మాటని సైతం తప్పారన్నారు. భగీరథ పథకం విషయంలో టీఆర్ఎస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, పోలీసులను వాడుకుంటూ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్కు పోయే కాలం దగ్గర పడిందని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా సరే.. మునుగోడులో బీజేపీ గెలుపుని ఆపలేరని వెల్లడించారు.
Also Read
- Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
- HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
- Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
- Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
అంతకుముందు.. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ఒక్క కేసీఆర్కి మాత్రమే దక్కుతుందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేసీఆర్ తన ఆస్తులు మాత్రమే పెంచుకున్నారన్నారు. 86 మంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాలను పట్టించుకోకుండా.. మునుగోడులో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?