Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు సంబంధించి క్వింటాకు 500 రూపాయల బోనస్ పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర అయోమయాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.
ఈ బోనస్ సొమ్ము అందాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశించిన 7 రకాల సన్న వరి విత్తనాలను మాత్రమే సాగు చేసి ఉండాలి. అందులో ఆర్ఎస్ఆర్ 15048 (తెలంగాణ సోనా), కేఎన్ఎం 1638 (కూనారం వరి-2), జైశ్రీరామ్, కేఎన్ఎం 7715, బీపీటీ 5204 (సాంబమసూరు), హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి) రకాలు ఉన్నాయి. రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాలకు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పుస్తకం, కొనుగోలు బిల్లు సమర్పించి సెప్టెంబర్ 10వ తేదీలోగా తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.
Also Read
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
- స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
- Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
నెల రోజుల కిందటే విత్తనాలు కొనుగోలు చేసినందున ఇప్పుడు పాత బిల్లులు దొరకక, దుకాణాల చుట్టూ తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల వ్యాపారుల వద్ద రికార్డులు లేకపోవడంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. మరోవైపు మార్కెట్లో లభించే ఇతర రకాల సన్న వరిని సాగు చేసిన రైతులు తమకు బోనస్ వర్తించకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకుని సాగు చేసిన రైతులు కూడా ఏ దుకాణంలో నమోదు చేసుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఈ సమస్యపై స్పందించిన జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. సొంత విత్తనాలు వాడిన రైతులు దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, స్థానిక వ్యవసాయ అధికారులకు సొంత డిక్లరేషన్ (Self-Declaration) రాసి ఇస్తే సరిపోతుందని తెలిపారు. సెప్టెంబర్ 10 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోనే దాదాపు 2.51 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను మరింత సులభతరం చేయాలని రైతాంగం కోరుతోంది.
తాజావార్తలు
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
-
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
-
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?