Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
- ఇన్ఫోర్మర్ల ముసుగులో గంజాయి నెట్వర్క్
- బొల్లా బ్రదర్స్ ఇంట్లో పోలీసులకే షాక్
- ఎస్సై వాకీటాకీతో మరింత మిస్టరీ
- ‘డెడ్ డ్రాప్’లో రోజుకు 25 సార్లు గంజాయి సప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన ‘డెడ్ డ్రాప్’ గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలు బయటపడుతున్నాయి. పోలీసులకు ఇన్ఫోర్మర్లుగా నటిస్తూనే, మరోవైపు బొల్లా బ్రదర్స్ పెద్ద ఎత్తున గంజాయి దందా నడుపుతున్నట్లు తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ విచారణలో తేలింది. క్యాటరింగ్ బాయ్స్ను సరఫరా చేసే వ్యాపారం ముసుగులో ఈ ముఠా నగరంలో గంజాయి నెట్వర్క్ను విస్తరించినట్లు అధికారులు గుర్తించారు.
పోలీసులతో దోస్తీ.. దందాకు స్కెచ్
గతంలో పలు చోరీల కేసులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించి నిందితులను పట్టించడంలో బొల్లా బ్రదర్స్ కీలక పాత్ర పోషించారు. ఇలా పోలీసుల నమ్మకాన్ని, సాన్నిహిత్యాన్ని పొందిన వీరు, ఆ దోస్తీనే అడ్డగా చేసుకుని గంజాయి వ్యాపారాన్ని నిర్భయంగా సాగించడానికి ప్లాన్ చేశారు. ఈగల్ ఫోర్స్ బృందం బొల్లా బ్రదర్స్ ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసిన సమయంలో, కొందరు స్థానిక కానిస్టేబుళ్లు వారితో కలిసి ఇంట్లోనే కల్లు పార్టీ చేసుకుంటూ ఉండడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే ఆ కానిస్టేబుళ్లను తీవ్రంగా మందలించిన ఈగల్ టీమ్ అక్కడి నుంచి పంపించివేసింది.
Also Read
ఎస్సై వాకీ టాకీ దొరకడం కలకలం
ఈ విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బొల్లా బ్రదర్స్తో తరచూ పార్టీలు చేసుకునే ఒక సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై), తన పోలీస్ మ్యాన్ ప్యాక్ (వాకీ టాకీ)ని వారి కారులోనే మరచిపోయి వెళ్లినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ మ్యాన్ ప్యాక్ వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు సదరు ఎస్సైని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కదలికలను ముందే తెలుసుకోవడానికే ఈ వాకీ టాకీని ఉపయోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
‘డెడ్ డ్రాప్’ పద్ధతిలో రోజుకు 25 సార్లు సప్లై
ఒడిశా నుంచి నగరానికి గంజాయిని రవాణా చేయడానికి బొల్లా బ్రదర్స్ దాదాపు 30 మందికి పైగా వ్యక్తులను నియమించుకున్నట్లు ఈగల్ దర్యాప్తులో వెల్లడైంది. నంబర్ ప్లేట్లు లేని మూడు ద్విచక్ర వాహనాలను ఉపయోగించి, కొనుగోలుదారులతో నేరుగా సంబంధం లేకుండా ‘డెడ్ డ్రాప్’ పద్ధతిలో రోజుకు దాదాపు 25 సార్లు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రెండు నెలల క్రితమే ఈగల్ టీమ్ బొల్లా బ్రదర్స్లో ఒకరిని అదుపులోకి తీసుకుని అతని ఫోన్ను సీజ్ చేసింది. అయితే, తమ దందాను కాపాడుకోవడానికి , పోలీసుల చర్యలను అడ్డుకోవడానికి బొల్లా బ్రదర్స్ కోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం వారి తెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
-
Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!