Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Chicken Center Owner Was Brutally Murdered

Siddipet Murder Case: చికెన్‌ సెంటర్‌ యజమాని హత్యకేసు.. నిందితులు వారే..

Published Date :April 23, 2024 , 9:52 am
By Bhanu
Siddipet Murder Case: చికెన్‌ సెంటర్‌ యజమాని హత్యకేసు.. నిందితులు  వారే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Siddipet Murder Case: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో చికెన్‌ సెంటర్‌ నడుపుతున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న జరిగిన చికెన్ సెంటర్ ఓనర్ మహిపాల్ రెడ్డి (42) హత్య కేసులో పురోగతి లభించింది. చికెన్ సెంటర్ లో పని చేసే వ్యక్తులే హత్య చేసినట్టు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఓనర్ ని షాపు లోపలికి పిలిచి డబ్బుల కోసమే హత్య చేసినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. హత్య చేసిన తర్వాత సీసీ కెమెరాల ధ్వంసం చేసి నిందితులు అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు పారిపోయినట్లు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read also: Kondagattu: ఆర్జిత సేవలు లేవన్నారు.. ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని భక్తుల ఆగ్రహం

Also Read

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
  • Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో
  • IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

అసలు ఏం జరిగింది..

ఉమ్మడి తూప్రా ఎన్ మండలం వెంకటాపూర్ పీటీ గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి(40) మండల కేంద్రంలోని ఉపాధ్యాయ కాలనీలో ఉంటూ చికెన్ సెంటర్ ఏడాదిన్నరగా అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. 30 రోజుల క్రితం బీహార్‌కు చెందిన కురబల్, రూబల్ అనే ఇద్దరు యువకులను చికెన్ సెంటర్ లో పని చేసేందుకు నియమించుకున్నాడు. ఆదివారం కావడంతో మధ్నాహ్నం భోజనానికి మృతుడు మహిపాల్ రెడ్డి సాయంత్రం 4 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో భార్య మానస ఫోన్ చేసి త్వరగా రమ్మని గుర్తు చేసిందని తెలిపారు. అయితే ఒక ఆర్డర్ వచ్చిందని అది ఇచ్చేశాక వస్తానని తెలిపిన మహిపాల్ కాల్ కట్ట చేశాడు. సాయంత్రం 6 గంటలు అయినా మహిపాల్ ఇంటికి రాలేదు దాంతో భార్య మళ్లీ కాల్ చేసింది. మహిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పని ఎక్కువ కావడంతో ఫోన్ లిప్ట్ చేసివుండరని భావించిన బార్య, మృతుడి సోదరుడు శ్రీపాల్‌రెడ్డి కి తెలిపింది దీంతో రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది.

Read also: Kondagattu: ఆర్జిత సేవలు లేవన్నారు.. ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని భక్తుల ఆగ్రహం

దీంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు చికెన్ సెంటర్ లో పనిచేస్తున్న కురబల్, రూబల్‌లకు ఫోన్ చేయగా వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. పక్కనే ఉన్న దుకాణదారులను పిలిపిస్తే దుకాణం మూసి వేసిందని చెప్పారు. సోమవారం ఉదయం జగదేవ్‌పూర్ కొచ్చి కుటుంబ సభ్యులు షెట్టార్‌ను తెరిచి చూడగా మహిపాల్‌రెడ్డి హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గజ్వేల్ సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ ఐ చంద్రమోహన్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించగా కాళ్లు, చేతులు వైర్లతో కట్టి నోటికి గుడ్డ పెట్టి దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. షాపులోని సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్క్ ధ్వంసమైనట్లు గుర్తించారు. వాటితో పాటు మద్యం సీసాలు, కాల్చిన సిగరెట్లు లభ్యమయ్యాయి. బృందంతో క్షుణ్ణంగా పరిశీలించగా అందులో పనిచేస్తున్న యువకులు పరారీలో ఉండడంతో వారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
BRS KTR: నేడు వరంగల్ కు కేటీఆర్..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brutal murder
  • Chicken center owner
  • CI Mahender Reddy
  • Siddipet district
  • Siddipet Murder Case

తాజావార్తలు

  • Saying ‘No’ Effectively: ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోండి.. ఈ 5 చిట్కాలతో పీపుల్- ప్లీజింగ్ అలవాటు వదిలించుకోండి

  • Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?

  • Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions