Chevella Bus Accident: ఇద్దరు పిల్లలను అనాథలను చేసిన చేవెళ్ల బస్సు ప్రమాదం
- చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- వికారాబాద్ దంపతుల దుర్మరణం
- అనాధలైన ఇద్దరు చిన్నారులు
- గ్రామంలో విషాద ఛాయలు
Chevella Bus Accident: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం ఓ కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన దంపతులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన వారు కురుగుంట బందేప్ప (45), కురుగుంట లక్ష్మి (43). వీరిద్దరూ జీవనోపాధి కోసం అడ్డా కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అయితే.. లక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శరీరంలో బలహీనత, అస్వస్థత కారణంగా వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున భార్యాభర్తలు చేవెళ్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు, చేవెళ్ల సమీపంలో బస్సు టిప్పర్ వాహనాన్ని ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
Sajjala Ramakrishna Reddy: సర్కార్పై సజ్జల ఫైర్.. ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది..!
ఈ ఘటనతో హాజీపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కురుగుంట బందేప్ప-లక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇద్దరు చిన్న పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారారు. గ్రామస్థులు, బంధువులు ఆ చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు కోల్పోయిన దంపతుల మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అధికారులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షలు, ప్రధాని మోడీ 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Chevella Accident : చేవెళ్ల ప్రమాదం వెనుక నిజాలు బహిర్గతం చేసిన ప్రత్యక్ష సాక్షి !
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..
-
Prashant Kishor: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సర్ప్రైజ్.. వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
-
Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా జూనియర్ ఎన్టీఆర్
-
Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
-
BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!