Kishan Reddy: మళ్ళీ బీజేపీదే అధికారం.. తెలంగాణలో ఎగిరేది మా జెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం, దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 31న 11 వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాలో జమ ఈ సందర్భంగా మోడీ ప్రసంగించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.. ఇది పార్టీ ప్రోగ్రాం కాదని గుర్తుంచుకోవాలి.
కేంద్రంలో లో కాంగ్రెసేతర ప్రభుత్వం పది సంవత్సరాల ను విజయవంతంగా పూర్తి చేసుకోబోతోంది. 2024లో కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ నే ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు. ప్రపంచంలోనే ఒక్క రోజూ శెలవు తీసుకోకుండా పని చేస్తున్న ప్రధాని మోడీ. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు…దేశం లో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది. సీఎం సీటును ఎడమ కాలి చెప్పుతో సమానమన్న కేసీఆర్… అదే సీఎం సీటును కొడుకు అప్పగించాలనే పుత్ర వాత్సల్యంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ లో ఆత్మహత్య చేసుకున్న రైతులను పట్టించుకోని కేసీఆర్ పంజాబ్ వెళ్లి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్ పేరు రాసి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. గుణాత్మక మార్పు అంటే కేసీఆర్ దృష్టిలో ఏంటి? కుటుంబ పాలన అప్పుల రాష్ట్రంగా మార్చడమా? విదేశీ విధానాన్ని పాకిస్థాన్ లాంటి శత్రు దేశాలు కూడా పొగుడుతున్నాయి. ఇది కేసీఆర్ కంటికి, చెవులకు కనిపించడం లేదా?జాతీయ విద్యా విధానంని విమర్శిస్తున్న కేసీఆర్… కేజీ టు పీజీ విద్య ఎక్కడ సమాధానం చెప్పాలి. ఓడిపోయిన కుటుంబ పార్టీలతో కలిసి కేసీఆర్ ఈ దేశాన్ని ఏం చేయబోతున్నాడు ఈ కుటుంబ పార్టీలన్నీ ఇప్పటికే విఫలం అయ్యాయి. తెలంగాణలో బీజేపీకి లభిస్తున్న ప్రజా స్పందన చూశాక కేసీఆర్ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. గుణాత్మక మార్పు పేరుతో దేశమంతా తిరుగుతున్నారు. 8 ఏళ్లలో ఏనాడూ సెక్రటేరియెట్ కు రాకపోవడమే గుణాత్మక మార్పా?
మీ మిత్రపక్షం ఎంఐఎం ఎంత బాధ పడ్డా తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం… ఎవరు ఆపలేరు. కెసిఆర్ ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్ పాలన అంతం కావాలని కోరుతున్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ తెరమరుగైంది. నాయకత్వలేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో కుటుంబ, వారసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకలించే వేసే సత్తా బీజేపీకే ఉంది. అందుకే ముందస్తు ఎన్నికలు,
రాజ్యాంగం మార్చాలని అంటున్నారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అయినా అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్ళింది మాత్రం లేదు. సంక్షేమం అంటున్న కెసిఆర్ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు.కేంద్రం ఏమీ చేయడం లేదని విమర్శిస్తున్న కేసీఆర్… సైన్స్ సిటీ కోసం 25 ఎకరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని ప్రతిపాదిస్తే, తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెబితే..కొత్తగూడెం-భద్రాచలం వరకు రైల్వే లేన్ వేస్తామని చెబితే ఎందుకు స్పందించలేదు? కేసీఆర్ సహా దేశవ్యాప్తంగా మరో వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేరు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే. ఈసారి అత్యధిక సీట్లతో అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!