MMTS Services Cancelled: దేవుడా మళ్లీనా.. మొత్తం 19 సర్వీసులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MMTS Services Cancelled: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. నేడు నగరం MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 19 సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
రద్దు చేసిన ఎంఎంటీఎస్..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
* లింగంపల్లి-ఫలక్నుమా మార్గంలో 6 సర్వీసులు,
* ఫలక్నుమా-లింగంపల్లి మార్గంలో 5 సర్వీసులు,
* హైదరాబాద్-లింగపల్లి మార్గంలో 3 సర్వీసులు ఉన్నాయి.
* అలాగే లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 2 సర్వీసులు,
* ఫలక్నుమా-రామచంద్రపురం, ఫలక్నుమా-హైదరాబాద్, రామచంద్రపురం-ఫలక్నుమా మార్గాల్లో ఒక సర్వీసును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Read also: Foreign Currency: ఎయిర్ పోర్ట్ లో పోలీసులకు షాక్.. కాటన్ బాక్స్ను పరిశీలించగా..
పలు రూట్లలో ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ సహకరించాలని కోరారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సర్వీసులను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశామని, రేపటి నుంచి యథావిధిగా అందుబాటులోకి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులందరూ తమకు సహకరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. అయితే ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో ప్రజలు మెట్రో, బస్సులను ఆశ్రయిస్తున్నారు.
Read also: Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగురు మృతి
అయితే తాజాగా…ఈనెల 7వ తేదీ పలు నిర్వహణ సమస్యల కారణంగా పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 17 సర్వీసులను రద్దు చేశారు. లింగంపల్లి – హైదరాబాద్ మార్గంలో 2 సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి – ఫలక్నుమా మార్గంలో 6 సర్వీసులు, ఫలక్నుమా-రామచంద్రపురం మార్గంలో ఒక సర్వీసు, ఫలక్నుమా-హైదరాబాద్ మార్గంలో ఒక సర్వీసును రద్దు చేశారు. సాధారణ ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!