80 lakh Car Burnt: అప్పు తిరిగి ఇవ్వలేదు.. రూ.80లక్షల స్పోర్ట్స్ కారు తగలపెట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
80 lakh Car Burnt: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్న అక్కసుతో రూ.80లక్షల విలువైన స్పోర్ట్స్ కారును తగులపెట్టిన ఘటన పహాడిషరీఫ్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: Balayya : బాలయ్యతో బోయపాటి మరో పొలిటికల్ మూవీ..?
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
నార్సింగ్ కు చెందిన నీరజ్ అనే వ్యాపారి 2009 మాడల్కి చెందిన డిఎల్ 09 సివి 3636 నెంబర్ గల లంబోర్ఘిని స్పోర్ట్స్ కారు ను సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేశాడు. ప్రస్తుతానికి ఆ కొత్త కారు సుమారు రూ.4కోట్ల విలువ ఉంటుంది. ఆ కారు షోకు తీరగానే నీరజ్ విక్రయించాలనుకున్నాడు. ఈ నేపధ్యంలోనే తనకు పరిచయమం ఉన్న అయాన్ అనే వ్యక్తికి చెప్పాడు. దీంతో అయాన్ తన స్నేహితుడైన మొఘల్పురాకు చెందిన అమన్ కు చెప్పాడు. కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమన్ కు, అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. దీంతో మామిడిపల్లి టు శంషాబాద్ రూట్ కు వెళ్లే రహదారిలో ఉన్న ఫాం హౌజ్ కు తీసుకురావాలని అహ్మద్ చెప్పాడు. కాగా.. నీరజ్ దగ్గర నుంచి అయాన్ కారు తీసుకువచ్చి అమన్ కు ఇచ్చాడు. అయితే.. అమన్ అతని స్నేహితుడు హందాన్ తో కలిసి జల్పల్లిలో ఆ స్పోర్ట్స్ కారును తీసుకుని మామిడి పల్లిలోని వివేకానంద స్టాచ్ దాటి ఎయిర్ పోర్ట్ రూట్ మధ్యలో ఆపారు.
Read also: Ponnam Prabhakar: బలహీన వర్గాలు ఆలోచించండి .. ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడండి..
అహ్మద్ తో పాటు మరి కొంత మంది కారు వద్దకు చేరుకొని నీరజ్ ఎక్కడ ? అతను మాకు డబ్బులు ఇవ్వాలని అంటూ వారిపై దుర్భాషలాడారు. నీరజ్ ను పిలిపిస్తామని చెప్పిన వినకుండా అహ్మద్ వెంట వచ్చిన వారు బాటిలో తెచ్చుకున్న పెట్రోల్ ను స్పోర్ట్స్ కారుపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అమన్ డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పహాడిషరీఫ్ పోలీసులు, ఫైయిర్ ఇంజన్ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్దమయ్యింది. సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత్ రెడ్డి, పహాడిషరీప్ ఇన్ స్పెక్టర్ గురువారెడ్డి, ఎస్ఐ మధుసూధన్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే అప్పు ఇవ్వలేదని ఇలా చేశాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే రీతిలో దర్యాప్తు చేస్తున్నారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్కు దక్కని ఊరట..
- Tags
- Burn
- businessman
- car
- hyderabad
- Neeraj
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!