Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలోని ఓల్డ్ టౌన్ బహదూర్పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. దీంతో ఈ భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనం కింది భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయి. భవనం పక్కకు వంగి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న భవనంలో నివసించే వారిని ఖాళీ చేయించారు. నిర్మాణంలో ఉన్న భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. భవనాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో అధికారులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. నేడు, ఈ భవనం కూల్చివేసే అవకాశం ఉంది.
Read also: IT Employees: ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్న భవనం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూలిన భవనాన్ని కూల్చే వరకు పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. గతంలో ఇదే తరహాలో ఓ భవనం బోల్తా పడిన ఘటన నగరంలోని చింతల్లో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లోని చింతల్లో మూడంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ జాక్లతో పైకి లేపారు. అయితే ఈ భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ పైకి వాలుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైడ్రాలిక్ జాక్లతో భవనాన్ని పైకి లేపుతున్నప్పుడు భవనంలో చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అంతేకాదు భవనం యజమానిపై కేసు నమోదు చేశారు. భవనాల నిర్మాణ సమయంలో నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనుమతులు లేకుండా నిర్మించడం, నాణ్యత లేని నిర్మాణాల వల్లే ఈ తరహా పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tirupati Crime: తిరుపతిలో షాకింగ్ ఘటన.. పోలీసులు కొట్టారంటూ రోడ్డుపై మహిళ నిరసన
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!