Hyderabad: నగరంలోని ఓల్డ్ టౌన్ బహదూర్పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. దీంతో ఈ భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనం కింది భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయి. భవనం పక్కకు వంగి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న భవనంలో నివసించే వారిని ఖాళీ చేయించారు. నిర్మాణంలో ఉన్న భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. భవనాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో అధికారులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. నేడు, ఈ భవనం కూల్చివేసే అవకాశం ఉంది.
Read also: IT Employees: ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!
నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్న భవనం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూలిన భవనాన్ని కూల్చే వరకు పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. గతంలో ఇదే తరహాలో ఓ భవనం బోల్తా పడిన ఘటన నగరంలోని చింతల్లో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లోని చింతల్లో మూడంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ జాక్లతో పైకి లేపారు. అయితే ఈ భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ పైకి వాలుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైడ్రాలిక్ జాక్లతో భవనాన్ని పైకి లేపుతున్నప్పుడు భవనంలో చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అంతేకాదు భవనం యజమానిపై కేసు నమోదు చేశారు. భవనాల నిర్మాణ సమయంలో నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనుమతులు లేకుండా నిర్మించడం, నాణ్యత లేని నిర్మాణాల వల్లే ఈ తరహా పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tirupati Crime: తిరుపతిలో షాకింగ్ ఘటన.. పోలీసులు కొట్టారంటూ రోడ్డుపై మహిళ నిరసన