Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలోని ఓల్డ్ టౌన్ బహదూర్పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. దీంతో ఈ భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనం కింది భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయి. భవనం పక్కకు వంగి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న భవనంలో నివసించే వారిని ఖాళీ చేయించారు. నిర్మాణంలో ఉన్న భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. భవనాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో అధికారులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. నేడు, ఈ భవనం కూల్చివేసే అవకాశం ఉంది.
Read also: IT Employees: ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!
Also Read
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్న భవనం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూలిన భవనాన్ని కూల్చే వరకు పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. గతంలో ఇదే తరహాలో ఓ భవనం బోల్తా పడిన ఘటన నగరంలోని చింతల్లో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లోని చింతల్లో మూడంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ జాక్లతో పైకి లేపారు. అయితే ఈ భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ పైకి వాలుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైడ్రాలిక్ జాక్లతో భవనాన్ని పైకి లేపుతున్నప్పుడు భవనంలో చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అంతేకాదు భవనం యజమానిపై కేసు నమోదు చేశారు. భవనాల నిర్మాణ సమయంలో నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనుమతులు లేకుండా నిర్మించడం, నాణ్యత లేని నిర్మాణాల వల్లే ఈ తరహా పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tirupati Crime: తిరుపతిలో షాకింగ్ ఘటన.. పోలీసులు కొట్టారంటూ రోడ్డుపై మహిళ నిరసన
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల
-
ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
-
Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
-
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?