Tirumala Tickets: టీటీడీ భక్తులకు శుభవార్త చెప్పింది. దర్శనం టిక్కెట్లు, వసతి గదుల బుకింగ్ కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్జిత సేవ, కల్యాణోత్సవం, వర్చువల్ సేవ, అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లతో పాటు సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, డార్మిటరీ రూమ్ బుకింగ్ టిక్కెట్లను ప్రకటించింది. నవంబరు మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను నిన్న ఉదయం విడుదల చేశారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అష్టదళపద్మారాధన కోసం భక్తులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అర్చన ఆర్జిత సేవా టిక్కెట్లను లక్కీడిప్ ద్వారా పొందవచ్చునని తెలిపింది. పేర్ల నమోదు అనంతరం లక్కీడిప్ ద్వారా భక్తులకు టిక్కెట్లు కేటాయిస్తారు. టిక్కెట్లు పొందిన తర్వాత భక్తులు రుసుము చెల్లించి ధృవీకరించుకోవాలని అధికారులు వెల్లడించారు.
Read also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
సహస్రదీపాలంకార, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అలాగే, ఆగస్ట్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సర్వీస్ టిక్కెట్లు విడుదల చేయబడతాయి. ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టిక్కెట్లను, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక శ్రీవారి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలోని హాస్టళ్ల బుకింగ్ కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. దర్శనం, వసతి టిక్కెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ ముందుగానే ప్రకటించింది. దీంతో భక్తులు ముందస్తు సమాచారం తెలుసుకుని టిక్కెట్లు విడుదల చేసిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ అన్ని టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తోంది.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?