Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త.. వసతి గదుల టికెట్లు 25న విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Tickets: టీటీడీ భక్తులకు శుభవార్త చెప్పింది. దర్శనం టిక్కెట్లు, వసతి గదుల బుకింగ్ కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్జిత సేవ, కల్యాణోత్సవం, వర్చువల్ సేవ, అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లతో పాటు సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, డార్మిటరీ రూమ్ బుకింగ్ టిక్కెట్లను ప్రకటించింది. నవంబరు మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను నిన్న ఉదయం విడుదల చేశారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అష్టదళపద్మారాధన కోసం భక్తులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అర్చన ఆర్జిత సేవా టిక్కెట్లను లక్కీడిప్ ద్వారా పొందవచ్చునని తెలిపింది. పేర్ల నమోదు అనంతరం లక్కీడిప్ ద్వారా భక్తులకు టిక్కెట్లు కేటాయిస్తారు. టిక్కెట్లు పొందిన తర్వాత భక్తులు రుసుము చెల్లించి ధృవీకరించుకోవాలని అధికారులు వెల్లడించారు.
Read also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
సహస్రదీపాలంకార, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అలాగే, ఆగస్ట్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సర్వీస్ టిక్కెట్లు విడుదల చేయబడతాయి. ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టిక్కెట్లను, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక శ్రీవారి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలోని హాస్టళ్ల బుకింగ్ కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. దర్శనం, వసతి టిక్కెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ ముందుగానే ప్రకటించింది. దీంతో భక్తులు ముందస్తు సమాచారం తెలుసుకుని టిక్కెట్లు విడుదల చేసిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ అన్ని టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తోంది.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!