Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త.. వసతి గదుల టికెట్లు 25న విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Tickets: టీటీడీ భక్తులకు శుభవార్త చెప్పింది. దర్శనం టిక్కెట్లు, వసతి గదుల బుకింగ్ కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్జిత సేవ, కల్యాణోత్సవం, వర్చువల్ సేవ, అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లతో పాటు సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, డార్మిటరీ రూమ్ బుకింగ్ టిక్కెట్లను ప్రకటించింది. నవంబరు మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను నిన్న ఉదయం విడుదల చేశారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అష్టదళపద్మారాధన కోసం భక్తులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అర్చన ఆర్జిత సేవా టిక్కెట్లను లక్కీడిప్ ద్వారా పొందవచ్చునని తెలిపింది. పేర్ల నమోదు అనంతరం లక్కీడిప్ ద్వారా భక్తులకు టిక్కెట్లు కేటాయిస్తారు. టిక్కెట్లు పొందిన తర్వాత భక్తులు రుసుము చెల్లించి ధృవీకరించుకోవాలని అధికారులు వెల్లడించారు.
Read also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
సహస్రదీపాలంకార, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అలాగే, ఆగస్ట్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సర్వీస్ టిక్కెట్లు విడుదల చేయబడతాయి. ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టిక్కెట్లను, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక శ్రీవారి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలోని హాస్టళ్ల బుకింగ్ కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. దర్శనం, వసతి టిక్కెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ ముందుగానే ప్రకటించింది. దీంతో భక్తులు ముందస్తు సమాచారం తెలుసుకుని టిక్కెట్లు విడుదల చేసిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ అన్ని టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తోంది.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!