BRS vs Congress: తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు..
- కృష్ణా నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
- అధికార- విపక్షాలు నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS vs Congress: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో నదీ జలాల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా కృష్ణా నదీ జలాల వివాదం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ప్రకటించింది. దీంతో అటూ అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా నదీ జలాల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి.
Read Also: Ravi Teja: ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ
Also Read
- OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ... బీఆర్ఎస్ భారీ స్కెచ్?
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు (జనవరి 3) ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో గులాబీ పార్టీ శ్రేణులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలపై పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. నేటి అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా.. దీనికి కౌంటర్ గా తెలంగాణ భవన్లోనే కృష్ణా నదీ జలాల వివాదం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?