BRS :పార్టీ కార్యకర్తల కంటే పేగుబంధం పెద్దదేమీ కాదు.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం
- కవిత మాట్లాడిన తీరు కార్యకర్తలను బాధించింది
- పార్టీ కార్యకర్తల కంటే పేగుబంధం పెద్దదేమీ కాదు
- కవిత వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్నే కాదు.. ప్రజల్ని కూడా బాధించాయి
- కవిత వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. -సత్యవతి రాథోడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కంటే ఎవరూ పెద్ద వారు కాదనే విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి చాటారని వారు పేర్కొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, గత మూడు నెలలుగా కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్లో అసహనానికి దారితీశాయని అన్నారు. “ఈరోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ముఖ్యంగా మహిళలు కూడా ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కోసం కవితను సస్పెండ్ చేశారు. పేగుబంధం కంటే పార్టీ ముఖ్యమని కేసీఆర్ చూపించారు” అని పేర్కొన్నారు.
Uttar Pradeash: రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన.. పోలీసుల లాఠీ ఛార్జ్ …
Also Read
అలాగే కవితపై మరింతగా స్పందిస్తూ, “ఆమె వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతా అవకాశాలు రాకపోవచ్చు కానీ కేసీఆర్ కవితకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కానీ ఆమె ఆ గుర్తింపును నిలబెట్టుకోలేకపోయింది. పార్టీ కంటే నేను ముఖ్యమనే విధంగా మాట్లాడడం వల్ల కార్యకర్తలు కూడా విసిగిపోయారు” అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. “కవిత ‘పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత’ అని అన్న మాట గుర్తు పెట్టుకోవాలి. పార్టీ ఉంటేనే కవితకు ఎంపీ, ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చాయి. నువ్వు కేసీఆర్ను నాన్న అని పిలుస్తావేమో కానీ తెలంగాణ ప్రజలు ఆయనను బాపుగా భావిస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసినవారిలో కవిత కూడా ఒకరిగా మిగిలిపోయారు” అని అన్నారు. అలాగే, “కవిత నిన్న మాట్లాడిన మాటలు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా ఆజ్యం పోసినట్లే కవిత ప్రవర్తించింది” అని సునీత మండిపడ్డారు.
వాడెవ్వడు..వీడెవ్వడు..కవితక్కకు అడ్డు ఎవడు? బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆలోచనలో కవిత
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!